Skip to main content

శ్రీ వెలగపూడి రామకృష్ణ - My Stamp

వెలగపూడి రామకృష్ణ గారు దక్షిణ భారతదేశములో పేరుగాంచిన ఉన్నతోద్యోగి (ఐ.సి.యస్ ), పారిశ్రామికవేత్త మరియు దాత. ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో తొలితరము పారిశ్రామికవేత్తలలో రామకృష్ణ ముఖ్యుడు. వీరి గౌరవార్ధం మన భారత తపాలా శాఖ 30-12- 2016న ఒక వ్యక్తిగత తపాలా బిళ్ళను (My Stamp) విడుదల చేసింది

Sri Velagapudi Rama Krishna
శ్రీ వెలగపూడి రామకృష్ణ గారు 1896లో గుంటూరు జిల్లా,రేపల్లె తాలూకా,నగరం మండలములోని బెల్లం వారిపాలెం అను గ్రామములో జన్మించాడు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామమునకు చెందినవారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయములో బీఎస్సీ మరియు ఎంఏ విద్య నభ్యసించాడు.బ్రిటిషు వారి పరిపాలనా కాలములో (1941) కృష్ణా కమర్షియల్ ప్రాడక్ట్స్ (కె.సి.పి) అను పరిశ్రమల సముదాయము ప్రారంభించాడు. వాటిలో చక్కెర, సిమెంటు తయారు చేయు పరిశ్రమలు ముఖ్యమైనవి.
రామ కృష్ణ గారు 1941 లో స్థాపించిన KCP Limited 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా మన తపాలా శాఖ వారి సౌజన్యం తో వ్యక్తిగత తపాలా బిళ్ళను 30-12-2016 న విడుదల చేసారు. వారిపై ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేయాలని ఆశిస్తున్నాం.
My Stamp sheetlet  on 75 Years of KCP Limited and Its founder 
Sri Velagapudi Rama Krishna on 30-12-201

అలాగే కెసిపి 75 వసంతాల వేడుకలో భాగంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను 27-12-2017 న చెన్నై లో విడుదల చేసారు. 
Special cover on kcp Limited

Special cover on KRISHNA PEX- 2005

ఇంతకు ముందు మచిపట్నం లో 17-9-2005 న జరిగిన కృష్ణా జిల్లా తపాలా బిళ్ళల ప్రదర్శనలో(KRISHNA PEX- 2005) ఒక ప్రత్యేక పోస్టల్ కవర్ విదుదల చేసారు. దానిపై పారిశ్రామిక దార్సినికుడు, మార్గ దర్శి శ్రీ వెలగపూడి రామకృష్ణ గారి చిత్రంతో పాటు వారిచే ఉయ్యురులో 1941 లో సహకార రంగంలో స్థాపించబడిన పంచదార మిల్లు (K.C.P. SUGARS),చెరుకు తోట చిత్రాలు ముద్రించారు.

K.C.P. SUGARS, UYYURU- IN SERVICE TO THE PEOPLE
Date of Issue: 17-9-2005
ఈ ప్రత్యేక పోస్టల్ కవరు పై మన రాష్ట్రానికి గవర్నర్ గా,ఉప రాష్ట్రపతిగా పనిచేసిన క్రిష్ణకాంత్ గారి పై విడుదల చేసిన తపాల బిళ్ళ,దానిపై మచిలీ పట్నం కు ప్రాతినిద్యం గా చేప బొమ్మతో ఉన్న ప్రత్యేక పోస్టల్ ముద్ర ఉన్నాయి.

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...