Skip to main content

Posts

Showing posts from April, 2014

ఓటు విలువ తెలుసుకో

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం గా కీర్తించబడే మన దేశంలో త్వరలో సాధారణ ఎన్నికలు (లోక్ సభ) వాటితో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి.  మంచి పాలకులు వస్తేనే ఈ దేశం , ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి.  మతానికి, కులానికి, ప్రాంతానికి, ధనానికి, దర్పానికి లొంగకుండా నిర్బయంగా ,వివేకంగా మన పాలకులను ఎన్నుకోవాలి.  స్వాతంత్రం వచ్చి 67 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ దేశం లో ఎవరికీ ఓటు వేయాలో , ఎటువంటి నాయకులను అధికార పీటం పై ఉంచాలో మనం తెలుసుకోలేక పోవటం శోచనీయం.   దొంగలు, దోపిడిదారులు, అవినీతి జలగలు, పుండాకోర్లు, దగాకోర్లు దర్జాగా మన ముందుకు ఓట్లు అడగటానికి వస్తున్నారు అంటే మనం ఎంతగా దిగజారి పోయి ఉన్నామో అర్ధం చేసుకోండి.   ఓటు విలువ పామరులకు తెలియజేయాటానికి అందరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే విషయానికి  విస్తృతం గా ప్రచారం చేయటానికి మన తపాలా శాఖ 1967 లో జరిగిన సాధారణ ఎన్నికల సమయం లోనే  ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను 13-1-1967 న విడుదల చేసింది. 57 ఏళ్ళు అయినా మనలో ఏమాత్రం చైతన్యం వచ్చినట్లు కనపడుటం లేదు.  అప్పుడు సాంబారు ఇడ్లీకి, సారా బుడ్డికి  ఓటు అమ్ముకున్న అమాయకులను

భద్రాచలం - ప్రత్యేక తపాల ముద్ర

The Inaugural cover of Pictorial Cancellation  at Bhadrachalam  Issued date : 09 April 1976.  ఆంద్ర అయోధ్యగా పిలవబడే భద్రాచలం కు మన తపాల శాఖ వారు 09 -04 -1976 లో ఒక ప్రత్యేక పోస్టల్ ముద్రను(Pictorial cancellation) కేటాయించారు. భద్రాచలం  శ్రీ సీతా రామా స్వామి ఆలయం పేరు వింటే జ్ఞప్తికి వచ్చే వ్యక్తి, ఆలయ నిర్మాణం చేసి  భక్త రామదాసుగా కీర్తించబడే కంచర్ల గోపన్న. భద్రాచల ఆలయ విశిష్టతను, చరిత్రను చాటేలా భక్త రామదాసు బొమ్మతో ఈ పోస్టల్ ముద్రను రూపొందించారు.  ఆ సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవరు పై భద్రాచల సితారామాలయ శిఖరం పై ప్రతిష్టించి ఉన్నకలశం 'శ్రీ చక్రం' ను ముద్రించారు.