Wednesday, February 8, 2012

సమ్మక్క - సారలమ్మ జాతర

MEGADOOTH POST CARD ON - Sammakka , Sarakka Jatara, Issued in Feb.2006
 సమ్మక్క - సారలమ్మ జాతర కు( 15-2-2006 to 18-2-2006)
 భక్తులకు ఆహ్వానం పలుకుతూ విడుదలైన మేఘదూత్ పోస్ట్ కార్డు

సమ్మక్క సారక్క జాతర  అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.వరంగల్లు జిల్లాకేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములోతాడ్వాయి మండలములో ఉన్నమారుమూల అటవీ ప్రాంతమైన మేడారం లో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈచారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది.
 కాకతీయ ప్రభువు ప్రతాప రుద్రుడి పై తిరుగు బాటు చేసి వీరమరణం పొందిన సమ్మక్క, సారక్కలను గిరిజనులు  దైవాలుగా, వనదేవతులుగా మార్చారు. నేడు పూజలందుకుంటున్న  సమ్మక్క-సారక్కల జాతర దేశములోనే అతి పెద్ద గిరిజన జాతరగా గణతికెక్కినది. మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సా,చత్తీస్‌గఢ్,జార్ఖండ్ రాస్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
1996 లో ఈ జాతరను రాస్ట్రప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించి మేఘ దూత్ పోస్ట్ కార్డ్ విడుదల చేసింది.  

Friday, February 3, 2012

Builders of Modern India

India Post Issued new series of  Definitive Stamps in the name of

 Builders of Modern India

2008 Dec 1
25 P- Jawaharlal Nehru
2009 Mar 1
Re 1- Mahatma Gandhi

2009 May 11

50 P- E V Ramasami
2009 Mar 1

Rs 2- B R Ambedkar
2009 Mar 1

Rs 3- Satyajit Ray
2009 Mar 1
Rs 4- Homi Bhabha


2008 Dec 1
Rs 5- Indira Gandhi
2008 Dec 1
Rs 5- Rajiv Gandhi
2009 May 11
Rs10- C.V.Raman

2009 Mar 1
Rs 15 - J R D Tata
2009 Mar 1
Rs 20- Mother Teresa
2009 May 11

Rs 50- Rukmini Devi Arundale

Wednesday, January 25, 2012

Our Republic Day

Republic Day commemorates the date on which the Constitution of India came into force replacing the Government of India Act 1935 as the governing document of India on 26 January 1950. 
While India's Independence Day on 15 th August,celebrates its freedom from British Rule, the Republic Day celebrates the coming into force of its constitution.
The 26th of January was chosen as a Republic Day to honour the memory of the declaration of independence of 1930 during our Freedom Struggle.The Purna Swaraj declaration, or Declaration of the Independence of India was promulgated by the Indian National Congress on January 26, 1930, resolving the Congress and Indian nationalists to fight for Purna Swaraj, or complete self-rule independent of the British Empire 
     India Post Issued a set of Four Stamps during the Inauguration of our constitution on 26 January 1950.

Rejoicing crowd- 2 ANNAS
Quill, Inkwell & Verse- 3.5 ANNAS
Ear of Corn & Plough- 4 ANNAS
Spinning Wheel & Cloth- 12 ANNAS
India post Issued one more stamp on the occasion of  25 th Anniversary of the repablic
Date Of Issue : 26January 197
Parliament House, New Delhi
STAMP  ISSUED ON THE  OCCASION OF 50 YEARS OF REPUBLIC OF INDIA
MAHATMA GANDHI - FATHER OF NATION
DATE OF ISSUE: 27 JANUARY 2000

Monday, January 23, 2012

నేతాజీ సుభాష్ చంద్రబోస్

NETAJI ON DEFINITIVE STAMP
iSSUED ON 23 JAN 2001

నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జననం జనవరి 231897 , మరణం: తెలియదు)

నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన సుభాష్ చంద్ర బోసు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు

 మహాత్మా గాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, తెల్లవాళ్ళ పై పోరాటం ద్వారానే మనకు స్వతంత్రం వస్తుందని  తలంచి, రెండవ ప్రపంచ యుద్ధం లో  జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం(I.N.A) ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.
ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అక్ష రాజ్యాలైన జర్మనీజపాన్,ఇటలీక్రొయేషియా,థాయ్‌లాండ్బర్మా , ఫిలిప్ఫీన్స్లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. 

 నేతాజీ  ఆగస్టు 181945 లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. 
S.C. Bose and INA Badge
 India  post  issued two stamps on Subhas Chandra Bose on his 67th Birth Anniversary 
 
JAI HIND - Chelo Delhi  by INA
Date of Issue : 23 January 1964

కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా నేతాజీ 
SUBHAS CHANDRA BOSE
Date of Issue :23 January 1997 
Indian National Army - 50th Anniversary - S.C.Bose inspecting Troops 
Date of Issue: 31 Decembar 1993
Three INA Stalwarts 
Shah Nawaz Khan, G.S.Dhillon , P.K.Sahgal and Red Fort
Date of Issue : 15 August 1997

Saturday, January 21, 2012

అక్షర దినం

India post Issued a Special Cover On 11-08-2007,at Karnataka State Philatelic Exhibition,Bangalore
అక్షర దినం 

Friday, January 20, 2012

కవి రాజు త్రిపురనేని రామస్వామి- 125వ జయంతి

ఈ ఏడాది  కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి  125 వ జయంతి సంవత్సరం.  1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులో పుట్టిన త్రిపురనేని తెలుగు నాట హేతువాద భావాలు వెదజల్లిన వైతాళికుడు. కవి రాజు గారి 125 వ జయంతి సంవత్సరంలో వారు చూపిన హేతువాద మార్గం లో సమాజం ముందుకు పోయేలా అభుదయ వాదులు, హేతువాదులు కృషి చేయాలి. వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ తిరిగి ప్రతిస్టించేలా కృషి చేయాలి.
1987 లో వారి శత జయంతి సందర్బంగా మన తపాలా శాఖ  ఒక ప్రతేక తపాల బిళ్ల (ఇండియా స్వతంత్ర పోరాటం - ఫిఫ్త్ సిరీస్ లో భాగంగా) 60 పైసల స్టాంప్విడుదల చేసింది.
T.RAMA SWAMY CHOWDARY
Date of Issue :25 -04-1987

తెలుగు నాట హేతువాదభావాలను వెదజల్లిన హేతువాది, వైతాళికుడు,కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి (1887-1943) గొప్ప సంఘసంస్కర్త, స్వతంత్ర యోధుడు. తెనాలి లో వారు స్థాపించిన ' సూతాశ్రమం' అనేక సంస్కరణ ఉద్యమాలకు  కేంద్రంగా  భాసిల్లింది. ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాదనంగా ఎంచుకున్నాడురామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టి గొప్ప అభ్యుదయ వాది.  
ముఖ్య రచనలు : 
సూతపురాణము, కొండవీటిపతనము, కుప్పుస్వామిశతకం, మాలదాసరి, గోపాలరాయ శతకం,పల్నాటి పౌరుషం,శంబూకవధ, సూతాశ్రమ గీతాలు, ధూర్తమానవ శతకము, ఖూనీ, భగవద్గీత ,రాణా ప్రతాప్.
కవిరాజు రాసిన ఒక దేశభక్తి గేయం

 వీరగంధము తెచ్చినారము - వీరుడెవ్వరో తెల్పుడీ 
పూసిపోదుము - మెడను వైతుము - పూలదండలు భక్తితో

తెలుగు బావుట కన్ను చెదరగ - కొండవీటను నెగిరినప్పుడు 
తెలుగు వారల కత్తి దెబ్బలు - గండికోటను గాచినప్పుడు 
తెలుగువారల వేడి నెత్తురు - తుంగభద్రను గలిసినప్పుడు 
దూరమందున్న సహ్యజ - కత్తినెత్తురు కడిగినప్పుడు 

ఇట్టి సందియమెన్నడేనియు - బుట్టలేదు రవంతయున్ 
ఇట్టి ప్రశ్నలు నడుగువారలు - లేకపోయిరి సుంతయున్ 
నడుము గట్టిన తెలుగు బాలుడు - వెనుక తిరుగండెన్నడున్ 
బాస యిచ్చిన తెలుగు బాలుడు - పారిపోవం డెన్నడున్

ఇదిగో యున్నది వీరగంధము - మై నలందుము, మై నలందుము 
శాంతిపర్వము చదువవచ్చును - శాంతి సమరంబైన పిమ్మట 
తెలుగునాటను వీరమాతను - జేసి మాత్రము తిరిగి రమ్మిక 
 పలు తుపాకులు పలు ఫిరంగులు - దారికడ్డము రాక తప్పవు 
  వీరగంధము తెచ్చినాము - వీరుడెవ్వరో తెల్పుడీ !! 


Tuesday, January 3, 2012

యానాం విమోచనోద్యమం

India Post Issued a  postage stamp  to commemorate  50 years of  De Facto Transfer of Pondicherry( yanam) on  27 December 2005 
De Facto Transfer of Pondicherry( yanam)
Date of Issue :27 December 2005

పుదిచ్చేరి రాష్ట్రం లో అంతర్ భాగం గా ఉన్న యానాం మన రాష్ట్రం లోని కాకినాడకు సమీపంలో ఉన్న తెలుగు ప్రాంతం. ఆంగ్లేయులనుండి భారత దేశానికి 1947 లో స్వాతంత్ర్యం వచ్చినా యానాం జూన్ 13 1954 వరకు ఫ్రెంచు వారి ఆధీనంలోనే ఉండి పోయింది. యానాంలో 1954 లో జరిగిన "భారత సైనిక దాడి" యానాం గతినే మార్చివేసినది.1954 జూన్ 27న యానాం ప్రజలు విమోచన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఇరవై ఒక్క తుపాకుల కాల్పుల అనంతరం మద్దింశెట్టి సత్యానందం ఫ్రెంచి పతాకాన్ని అవనతంచేసి భారత పతాకాన్ని ఎగురవేసారు.
నవంబరు 1 1954 న ఫ్రెంచి స్థావరాలనుపుదుచ్చేరి, యానాం, కారైకాల్, మాహే) భారతదేశమునకు వాస్తవికాంతరణ ( De-facto Tracfer) చేయబడినవి . కాని విధితాంతరణ (De-jure transfer) మాత్రము ఆగష్టు 16 1962 లొ జరిగినది. ప్రతీ సంవత్సరము, ఈ దినమును విధితాంతరణ దినముగా వేడుకలు జరుపుకుంటారు.