Skip to main content

Posts

Showing posts from December, 2022

అల్లూరి సీతారామరాజు స్మృతి మందిరం , కృష్ణ దేవిపేట

Aluri Raju's tomb in Krishna Devi Peta village. AP. India Post released a special cover on Alluri Sitharamaraju memorial at Krishna Devipeta, A.P on 23 rd August 2021 With respect to many unsung Indian heroes of our prolonged battle against the British colonial rule in the past, Alluri Sitarama Raju, a great and daring revolutionary is one among them. His spirited and vital role in the Rampa rebellion of 1922–24 has carved a permanent niche for him in the pages of Indian history of freedom struggle.Alluri Raju's tomb is in Krishna Devi Peta village in Visakhapatnam district. భారత తపాల శాఖ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మృతి మందిరం , కృష్ణ దేవిపేట పై ఒక ప్రత్యేక కవరును 23 ఆగస్టు 2021న విడుదల చేసింది. 23 ఆగస్టు 1922 లో కృష్ణదేవి పేట పోలీసు స్టేషన్ పై అల్లూరి దాడి  చేసి అక్కడ ఉన్న ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. కృష్ణ దేవిపేట లో అల్లూరి సమాధిని నిర్మించారు.   

రంప తిరుగుబాటు శాతాబ్ది ఉత్సవాలు

India Post released a set of  two special covers on Rampa Revolution led by Alluri Sitharamaraju on 16th March 2022 at Addatigala and Rampa Chodavaram in Andhra pradesh.  అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన  రంప తిరుగుబాటు శాతాబ్ది ఉత్సవాల సందర్భంగా 16 మార్చ్ 2022 న రెండు అందమైన ప్రత్యేక కవర్లు విడుదల చేసారు.  అల్లూరి ముఖ్య అనుచరులు గాం మల్లు దొర మరియు  బొనంగి పాండు పడాలు   పై వీటిని విడుదల చేసారు. బ్రిటిష్ వారికి ముందస్తు దాడి సమాచారాన్ని మిరపకాయ టపా (Chilli Post) ద్వారా తెలిపేవారు. కవరుపై వారి చిత్రాలతో పాటు దీన్ని ముద్రించారు. వీటిపై  రామరాజు దాడి చేసిన అడ్డతీగెల, రంప చోడవరం పోలీస్ స్టేషన్స్ ఉన్న తపాలా ముద్రతో క్యాన్సిల్ చేసారు.   

వైభవంగా ముగిసిన APPEX - 22

విశాఖపట్నం లో 2022 నవంబరు 23,24,25 తేదీలలోజరిగిన రాష్ట్రస్థాయి తపాలాబిళ్ళల పోటీ ప్రదర్శన APPEX - 22 ( 13th Andhra Pradesh State level Philately exhibition ) ద్విగ్విజయంగా ముగిసింది. నవ్యఆంధ్ర లో తొలిసారి జరిగిన ఈ తపాలా ప్రదర్శనలో  మన ఆంధ్రప్రదేశ్ లోని 109 మంది తపాలా బిళ్ళల సేకరణ దారులు షుమారు  320 ఫ్రెములలో 5200 పైగా షీట్స్ లో వేలాది తపాలాబిళ్ళలను ప్రదర్శించారు.  దీనిలో పాల్గొని  నేను  ( కొడాలి శ్రీనివాస్)   ఐదు ఫ్రెములలో 80 షీట్స్ తో  ప్రదర్శించిన " Indian's  Struggle for Freedom" కు సిల్వర్ బ్రాంజి మెడల్ వచ్చింది. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ అవతరించిన తరువాత జరిగిన రాష్ట్ర స్థాయి తపాలబిళ్ళల ప్రదర్శన Appex 22.  అన్ని రాష్ట్ర లలో ఇలా పోటీలు జరుగుతాయి. వీటిలో ఉత్తమ పతకాలు వచ్చిన ఫిలాటలిస్టులతో  (2023, ఫిబ్రవరి 11  నుండి 15) దేశ స్థాయిలో అమృత ఫెక్స Amurtpex - 23 ఢిల్లీ లో జరుగుతుంది.  జ్ఞానాభిలాష కు తపాలబిళ్ళల సేకరణ ఒక మార్గం.  ఇది  మంచి అభిరుచి. ఈనాటి తరానికి దీని గురించి తెలియదు. నేటి విద్యార్థులకు,యువతకు దీన్ని పరిచయం చేస్తే వారు జ్ఞానాభివృద్దితో పాటు చేడు  అలవాట్లకు బాని