Skip to main content

కాకతీయులకు గుర్తింపు ఏది?

శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని,జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. తొలుత చాళుక్యులకు తరువాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి, తెలుగు దేశమును ఏకము చేసి పరిపాలన సాగించిన వారు కాకతీయులు. కాకతీయ సామ్రాజ్యము(1083-1326)వెల్లివిరిసిన కాలములో తెలుగు భాష, సంస్కృతి, శిల్పము, సాహిత్యము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత రాణి రుద్రమ దేవి.
కాకతీయ సామ్రాజ్యం 14వ శతాబ్దపు తొలి సంవత్సరములలో తురుష్కుల దాడిని పలుమారులు ఎదిరించి చివరకు క్రీ. శ. 1323 లో రెండవ ప్రతాప రుద్రుని మరణంతో పతనమయ్యింది. ఆ తరువాత కాకతీయుల సేనానులు ముసునూరు నాయకులు 1326 లో తిరిగి తురుష్కులను పారదోలి 1370 వరకు ఓరుగల్లును పాలించారు. ముసునూరి కాపయ నాయకుని మరణంతో వైభవాన్ని కోల్పోయి ఈ ప్రాంతం ముస్లిం పాలకుల చేతికి వచ్చింది. తరువాత బహుమనీ సుల్తానులుగోల్కొండ సుల్తానులు, మొఘలు పరిపాలకులు, నిజాం సుల్తానులు ఏలుబడిలోకి వచ్చి పోలిస్ చర్య తో భారత దేశం లో విలీనం చెందింది.
గొప్ప విషయం ఏమిటంటే, ఇంతకు ముందు నిజాం సంస్థానం భారత దేశంలో విలీనం కాక ముందు వారి  పాలనలో వాడిన తపాలా బిళ్ళపై కాకతీయుల ఓరుగల్లు కోట ద్వారం ముద్రించబడినది. మన తపాలా శాఖ వారు ఇంతవరుకు ఒక్క తపాలా బిళ్ళ కుడా కాకతీయుల పై విడుదల చేయలేదు.
నిజాం ప్రభుత్వం విడుదల చేసిన తపాల బిళ్ళ- కాకతీయ ద్వారం -వరంగల్లు 
తపాలా శాఖ వారు ప్రముఖ చారిత్రిక ప్రదేశాలకు ప్రత్యేక తపాలా ముద్రను కేటాయించటం ఒక సాంప్రదాయం. దానిలో భాగంగా వరంగల్లుకు ఒక ప్రత్యక తపాల ముద్రను  1-8-1975 లో కేటాయించారు. ఈ తపాలా ముద్రలో  కాకతీయుల ప్రతాప చిహ్నం గా బాసిల్లె కోట ద్వారం ఉంటుంది.
అలాగే 1981 లో ప్రతాప రుద్రుడు బొమ్మతో ఒక ప్రత్యేక తపాలా ముద్ర ను APPEX -81 లో విడుదల చేసారు. ఈ చిన్న గుర్తింపులు మాత్రమే మన కాకతీయుల చరిత్ర కు సంభందించినవి.
Special cover and Pictorial Post mark on
KAKATIYA GATE -WARANGAL (కాకతీయ ద్వారం -ఓరుగల్లు )
Date of Issue: 1-08-1975
The Special postal cancellation shows The last King 
Prathapa Rudra (1289 -1323)of Kakathiya Dynasty,Orugallu.  
Date of Issue: 12-1-1981
కాకతీయులకు తపాలా బిళ్ళల పై గుర్తింపు ఏది?
ఇప్పటికైనా ఘన చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా మన తెలుగు వారి కీర్తి చాటేలా భారత తపాలా శాఖ వారు ప్రత్యేక తపాలా బిళ్ళలను ఈ కాకతీయ ఉత్సవాల సందర్బంగా విడుదల చేయాలి. రాణి రుద్రమ దేవి, కాకతీయ కోట ద్వారం, రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి వంటి వాటిని ఇతివృత్తం గా తపాలా బిళ్ళలు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలి. పర్యాటకంగా ఇది అభివృద్ధి చెందాలంటే తపాలా బిళ్ళలు విడుదల చేసి దేశ వ్యాప్త ప్రచారం చేయాలి.

అలాగే  గోవా, యానం(పుదిచ్చేరి) ప్రాంతాల విమోచనలకు గుర్తింపుగా తపాల బిళ్ళను విడుదల చేసిన తపాలా శాఖ  హైదరాబాద్ సంస్తానం (నిజాం) విమోచనకు కుడా తపాలా బిళ్ళ విడుదల చేయాలి. 

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

Stamps Issued by India Post- 2024

భారత తపాలా శాఖ  2024 లో మొత్తం 32 ప్రత్యేక తపాల బిళ్లలను, 11 మినియేచర్స్  విడుదల చేసింది.  వీటిలో అత్యధిక విలువతో 100 రూపాయల శ్రీ రామ జన్మభూమి దేవాలయం పై  మినియేచర్  ముఖ్యమైనది. 6 తపాలా బిళ్లలతో కేవలం 30 రూపాయల ముఖ విలువగల దీనిని 100 రూపాయలకు అమ్మటం జరిగింది.  ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల  ముద్రించిన తపాల బిళ్ళ ఉన్న మినియేచర్ ను 300 రూపాయలకు చేసి అమ్మారు. ఇదే ఇప్పటివరకు  ఖరీదైనదిగా నమోదు చేయబడింది. ఈ ఏడాది మన వెండి తెర వెలుగు పద్మభూషణ్ అక్కినేని శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక తపాలా బిళ్ళ వెలువడింది.  Sri Rama Janmbhoomi Temple Face Rs 30  Sold for  Rs 100 Embedded with Water from the holy river Saryu, Soil from the holy city of Ayodhya, Fragrance of Sandal wood, and gold foil at relevant portions శ్రీ రామ జన్మభూమి దేవాలయం - మినియేచర్  1.      Shri Ram Janmbhoomi Temple 18 JAN 500 p(6) 10,00,000 Security Printing Press, Hyderabad 2. 100th Birth Anniversary of Karpoori Thaku...

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...