Skip to main content

గణితమేధావి శ్రీనివాస రామానుజన్


Every year December 22, the birthday of  Srinivasa Ramanujam is celebrated as National Mathematics Day.’  In view of this  India Post released a commemorative  postal stamp on  on  22-12-2012.

National Mathematics Day
Date of  Issue : 22 December 2012
 జాతీయ గణిత దినం సందర్బంగా మన భారత తపాలా శాఖ వారు 22-12-2012 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసారు. ఈ తపాలా బిళ్ళ పై నంబర్ థియరీ తో శ్రీనివాస రామానుజం చిత్రాన్ని ముద్రించారు.





Srinivasa Ramanajan - First Day Cover
ఈ తపాలా బిళ్ళ నిజానికి  డిసెంబర్ 22,2011 న విడుదల కావలిసి ఉండగా దానిని అర్దాంతం గా నిలిపి మరొక ప్రత్యేక తపాలా బిళ్ళ శ్రీనివాస రామానుజం గారికి విడుదల చేసారు. ఇలా ఎందుకు చేసారో తెలియదు. బహుశ దానిపై రాముజం పేరు లేకపోవటం కారణం కావచ్చు.(తప్పు ఉంటె తమిళ సోదరులకు చిర్రెతుకొస్తుంది)
కొంత మంది డీలర్లు ఈ తపాలా బిళ్ళను నిరుడే పోస్ట్ ఆఫీసు నుండి లోపాయకారిగా సేకరించి దానితో వ్యాపారం చేసారు. ఒక్కో తపాలా బిళ్ళ 1000 రూపాయల దాకా అమ్మటం జరిగింది.
ఇంతక మునుపు 1994 లో బేగం అక్తర్ కు విడుదల చేసిన తపాలా బిళ్ళ విడుదల చేయకుండా ఆపటం దానిని డీలర్స్ 1000 రూపాయలకు అమ్ముతున్నారు. అలాగే విడుదల చేయకుండా 2005 లో ఉపసంహరించిన గురు గ్రంధ సాయబ్ కుడా దాదాపు 1200 రూపాయలు పైనే పలుకుతున్నది. 1994 లో విడుదల చేసి మధ్యలో ఉపసంహరించిన నీటి పక్షులు కు సంబందించిన నాలుగు తపాలా బిళ్ళలు నేడు 4000 వేల వరుకు వుంది. 
ఇలాగే ఈ తపాల బిళ్ళ  కుడా మంచి ధర పలుకుతుందని ఆశ పడ్డవారి లెక్క తప్పింది. 2011  లో విడుదల చేయకుండా ఉన్న ఈ తపాల బిళ్ళను జాతీయ గణిత దినం సందర్బంగా 2012 లో విడులచేసారు. దీనివల్ల అధిక ధర తో ఈ తపాలా బిళ్ళను కొన్న అమాయక తపాలా సేకరణ దారులు నష్టపోయారు. అనదికారకంగా ఈ లెక్కల మేధావి తపాలా బిళ్ళలు దక్కించుకొని కోట్లు గడిద్దాం అని అనుకొన్న తపాల బిళ్ళల  వ్యాపారుల లెక్కలు తారుమారాయి.
పోయిన ఏడాది (22-12-2011 ) రామానుజం 125  వ జయంతి సందర్బంగా విడుదల చేయాలిసిన తపాలా బిళ్ళ స్థానం లో  క్రింద ఉన్న తపాల బిళ్ళను 'రామానుజం' పేరుతో  విడుదల చేసింది.

Srinivasa Ramanajan ( Mathametician ) 
Date of  Issue : 22 December 2011
Srinivasa Ramanajan - First Day Cover
ఇంతకు ముందు భారత ప్రభుత్వం 1962 వ సంవత్సరంలో కుడా శ్రీనివాస రామానుజం గారి  75వ జన్మదినం నాడు, సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ ఒక  స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
Srinivasa Ramanajan ( Mathametician ) 
Date of  Issue : 22 December 1962

శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబరు 221887ఏప్రిల్ 261920) మన దేశం గర్వించ దగ్గ గొప్ప  గణితమేధావి. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు.
గణిత శాస్త్రం లో  ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబరు 22 ను జాతీయ గణిత  దినోత్సవంగా ‘National Mathematics Day’ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  2012 ను జాతీయ గణిత సంవత్సరం గా ప్రకటించారు.
Srinivasa Ramanajan - First Day Cover

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...