Skip to main content

జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు- సచిన్ కొరకు సడలించిన నియమం

చాలా దేశాలు జీవించి ఉన్నప్రముఖు వ్యక్తులకు వారి గౌరవార్దం తపాల బిళ్ళలు విడుదల చేస్తుంటాయి.
ఇదే కోవలో మన తపాలా శాఖ కుడా ఇంతకు ముందు కొన్ని సందర్బాలలో జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు విడుదల చేసింది. మనకు స్వతంత్రం సిద్దించిన తరువాత మహాత్మా గాంధీజీ కి బ్రతికి ఉండగానే తపాలా బిళ్ళ విడుదల చేయాలనుకొన్నా వారు వెంటనే హత్య కు గిరి కావటం వల్ల అది కార్య రూపం చెందలేదు. 
Dr. M. VISWESVARAYA(15-9-1960)
నూరు ఏళ్ళు జీవించిన ప్రముఖ వ్యక్తులకు తపాలా బిళ్ళలు విడుదల చేయటం ఒక ఆనవాయితీగా వచ్చింది .

ఈ కోవలో  1958 లో తొలి సారి దేశంలో మహిళా విద్యకు బీజం వేసిన  మహర్షి , భారత రత్న Dr D. K. కార్వే గారికి వారి 100 వ జన్మ దినాన (మరణం 1962లో)ఒక తపాల బిళ్ళ , అలాగే  ప్రముఖ ఇంజనీర్ భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి వారి 100 వ జన్మ దినం సందర్బంగా 1960 లో (మరణం 1962లో)  ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది. 
1980 లో అమెరికా నివాసి, సంఘ సేవకరాలు లక్నో లిటరసీ హౌస్ స్థాపించిన  వెల్ది ఫిషర్ 100 వ జన్మ దినం కు(మరణం 1980లో)ఒక తపాలా బిళ్ళ ను విడుదల చేసింది.
ఆ తరువాత  నిండునూరు ఏళ్ళు జీవించిన గొప్ప వ్యక్తులు లేక ఆ సంప్రదాయం మళ్లీ రాలేదు.



DR.D.K.KARVY(18-4-1958)


WELTHY FISHER(18-3-1980)


అలాగే  1979 లో నోబుల్ ప్రైజ్ అందుకున్న సందర్బంగా 1980 లో  మదర్ తెరిసా కి కూడా ఒక తపాలా బిళ్ళను విడుదల చేసి విమర్శల పాలైంది. ఆ తరువాత ఆమె మరనాతరం మరో మూడు తపాలా బిళ్ళలు విడుదల చేసింది. 
MOTHER TERESA (27-8-1980)



















రాష్ట్రపతి కి తపాల బిళ్ళతో వీడుకోలు 
మన రాష్ట్రపతులు గా పనిచేసి పదవి విరమణ చేసే రోజున వారి గౌరవార్దం తపాలా బిళ్ళ ను విడుదల చేయటం కుడా ఒక సాంప్రదాయం గా ఉంది. 
1962 లో రాష్ట్రపతిగా పదవి విరమణ చేస్తున్న బాబు రాజేంద్ర ప్రసాద్ కు, 1967 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కు 1974 లో వి.వి గిరి గారికి ఈ సాంప్రదాయాన్ని బట్టి తపాలా బిళ్ళలు వేసింది. అలాగే రాష్ట్రపతులుగా పనిసేస్తూ మరణించిన జాకీర్ హుస్సేన్ , పక్రుద్దిన్ అలీ అహమ్మద్ కు వెను వెంటనే తపాలా బిళ్ళలు వేశారు.
ఆ తరువాత కాంగ్రెసేతర రాష్ట్ర పతి గా ఉన్న నీలం సంజీవ రెడ్డి కి తపాలా బిళ్ళను వేయకుండా (ఇందిరా గాంధీ) ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది. రాష్ట్రపతి తో సహా జీవించి ఉన్న వారికి ఇకపై తపాల బిళ్ళలు విడుదల చేయకూడదను కున్న నియమాన్నిపెట్టుకుంది . 
Centenary of Indian National Congress-portraits of Congress Presidents
28-12-1985
ఆ తరువాత ఇక ఎట్టి పరిస్థితులలోను జీవించి ఉన్న వ్యక్తులకు తపాల బిళ్ళలు విడుదల చేయమని చెప్పారు. అయితే 1985 లో మరోసారి అలవాటులో పొరపాటుగా కాంగ్రెస్ పార్టీ 100 వసంతాలు జరుపుకుంటున్న సందర్బంగా ఆ పార్టీకి అధ్యక్షులగా పనిచేసిన 61 మంది వ్యక్తుల బొమ్మల తో నాలుగు తపాలా బిళ్ళలు విడుదల చేసింది. అప్పటికి బ్రతికి ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి , సంజీవ రెడ్డి ,శంకర్ దయాళ్ శర్మ వంటి వారితో పాటు  చివరి బొమ్మ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ చిత్రాలను ఒక తపాలా బిళ్ళ వచ్చింది . ఈ తపాలా బిళ్ళ తో మరల విమర్శలు వచాయి .
ఆ తరువాత మరల ఇప్పటివరకు మన తపాలా శాఖ జీవించి ఉన్నవారికి తపాలా బిళ్ళ వేయలేదు. 
సచిన్ కొరకు సడలించిన నియమం 
 క్రికెట్ క్రీడ నుండి నిష్కక్రమిస్తున్న సాచి టెండూల్కర్ కొరకు తపాల శాఖ తన పాత నిర్ణయాన్ని మార్చుకుంది.  తపాలా శాఖ ( కేంద్ర ప్రభుత్వం) అతి ఉత్సాహం తో ఆగమేఘాల మీద (2013 లో విడుదల చేసే తపాలా బిళ్ళలను 2012 లోనే నిర్ణయిస్తారు) సచిన్ కు ఒకటి కాదు ఏకంగా రెండు తపాలా బిళ్ళలు వాటితో పాటు ఒక మినిఎచర్ ఒక షీట్ లేట్ విడుదల చేసింది. సాదారణంగా వ్యక్తుల కు 5 రూపాయల విలువగల  3 లక్షలు తపాలా బిళ్ళలు విడుదల చేస్తారు. కాని సచిన్ కు రెండు రకాల 20 రూపాయల తపాలా బిళ్ళ లు ,ఒక్కోటి 30 లక్షల చొప్పున వెరిసి 60 లక్షలు విడుదల చేశారు. వీటి తో పాటు 24 లక్షల 40 రూపాయల విలువగల మినియెచర్లు, 16 లక్షల 320 రూపాయల విలువగల షీట్ లెట్ (16 స్టాంప్స్ ) ను విడుదల చేసారు . సచిన్ పై ఉన్న అభిమానాన్ని వ్యాపారంగా చేసుకోవటానికి మన తపాల శాఖ ఇంత వెలతో తపాల బిళ్ళలు విడుదల చేసింది . 
SACHIN TENDULKAR (14-11-2013)
 ఈ విషయం లో మన తపాలా శాఖ (ప్రభుత్వం) మరల విమర్శకులకు పని కల్పించింది. క్రికెట్ అనేది నేడు ఒక వ్యాపార క్రీడ. కోట్లాది డబ్బు దిని చుట్టూ తిరుగుతుంది.  ఈ వ్యాపారం లో తన వంతుగా తపాల బిళ్ళలు అమ్మి  (కొన్ని చిన్న దేశాలు తపాల బిళ్ళలు అమ్ముకొని డబ్బు సంపాదిస్తాయి )డబ్బు గడించాలనే తపాల శాఖ  వైఖరి నిజంగా గర్హనీయం. 

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...