Skip to main content

Centenary Celebrations of First Andhra Conference

On the occation of the centenary celebrations of First Andhra Conference (`Pradhama Andhra Mahasabha’) India Post released a Special Postal cover  on 24-5-2013 at the historic Town Hall ,at Bapatla, Andhra Pradesh. 
Union Minister of State for Petroleum and Natural Gas Panabaka Lakshmi inaugurated the event by hoisting a flag and released a Special Postal Cover marking the historic event.
ప్రధమాంధ్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు
1913 లో బాపట్ల లో 'ఆంద్ర  మహాసభ' తొలి సమావేశం జరిగింది. దానిని పురస్కరించుకొని ప్రధమాంద్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు బాపట్ల లోజరిగిన సందర్బం గా మే 24 , 2013 న మన తపాలా శాఖ(విజయవాడ) ఒక ప్రత్యక తపాలా కవర్ ను విడుదల చేసింది.
ఈ ప్రత్యేక కవర్ పై ప్రధమాంద్ర మహాసభ లోగోను దానిపై  క్యాన్సిలేషన్ కొరకు ఆంధ్ర మహాసభ జరిగిన బాపట్ల టౌన్ హాల్ చిత్రం తో ప్రత్యక తపాలా ముద్ర ను రూపొందించారు
ప్రత్యేక తపాల కవర్ విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి  తదితరులు 
బాపట్ల-టౌన్ హాల్ 
తెలుగు వారికి ఒక ప్రత్యక రాష్ట్రం కావాలనే కోరికకు బాపట్లలోనే అంకురార్పణ జరిగింది. బాపట్లలో జిల్లా కాంగ్రెసు సభ ముగిసిన మరుసటిరోజు అనగా 1913 మే 26న తొలి సారిగా  ఆంధ్ర మహాసభ బాపట్లలో జరిగింది. ఆంధ్రోధ్యమానికి బీజం పడింది.  ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు బాపట్ల  మహా సభలో రూపు రేఖలు దిద్దుకున్నాయి . ఆంధ్రుల హృదయాలలో మోసులెత్తిన భాషా అభిమాన, చైతన్యాలకు బాపట్ల ముత్యాల పందిరి వేసింది . తెలుగువారి వ్యక్తిత్వం ,ఆంధ్రభాషా గుర్తింపు కోసం కృషి చేయాలన్న పూనిక జరిగింది . పర్యవసానంగా ఆంద్ర రాష్ట్రం, ఆంద్ర విశ్వవిద్యాలయం, ఆతరువాత ఆంద్ర ప్రదేశ్ అవతరించాయి.
ఆనాడు వివిధ ప్రాంతాల నుండి మొత్తం 800 మంది ప్రతినిధులు, రెండువేల మంది సదస్యులు ఈ సభలకు హాజరయ్యారు. వందేమాతరం తో మొదలైన ఈ  సమావేశ కార్యక్రమాలు ఆసాంతం తెలుగులోనే నిర్వహించారు. అప్పటి మద్రాసు రాష్ట్రశాసన మండలి సభ్యులు శ్రీ బయ్యానరసింహేశ్వర శర్మ ఈ సభకు అధ్యక్షులుగా వ్యవహరించారు. 
ముట్నూరు ఆదినారాయణ , పింగళి వెంకయ్య , భోగరాజు పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, వల్లూరు సూర్యనారాయణ చిలకమర్తి లక్ష్మినరశింహం, గంటి వెంకటరామయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, వేమవరపు రామదాసు పంతులు, న్యాపతి సుబ్బారావు, గుత్తి కేశవపిళ్ళే , పూసపాటి వెంకటపతిరాజు, మోచెర్ల రామచంద్రరావు, సి. వి. నారాయణరావు, వెంకటరమణారెడ్డి వంటివారు అనేకమంది ప్రముఖులు ఈ మహాసభలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

Stamps Issued by India Post- 2024

భారత తపాలా శాఖ  2024 లో మొత్తం 32 ప్రత్యేక తపాల బిళ్లలను, 11 మినియేచర్స్  విడుదల చేసింది.  వీటిలో అత్యధిక విలువతో 100 రూపాయల శ్రీ రామ జన్మభూమి దేవాలయం పై  మినియేచర్  ముఖ్యమైనది. 6 తపాలా బిళ్లలతో కేవలం 30 రూపాయల ముఖ విలువగల దీనిని 100 రూపాయలకు అమ్మటం జరిగింది.  ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల  ముద్రించిన తపాల బిళ్ళ ఉన్న మినియేచర్ ను 300 రూపాయలకు చేసి అమ్మారు. ఇదే ఇప్పటివరకు  ఖరీదైనదిగా నమోదు చేయబడింది. ఈ ఏడాది మన వెండి తెర వెలుగు పద్మభూషణ్ అక్కినేని శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక తపాలా బిళ్ళ వెలువడింది.  Sri Rama Janmbhoomi Temple Face Rs 30  Sold for  Rs 100 Embedded with Water from the holy river Saryu, Soil from the holy city of Ayodhya, Fragrance of Sandal wood, and gold foil at relevant portions శ్రీ రామ జన్మభూమి దేవాలయం - మినియేచర్  1.      Shri Ram Janmbhoomi Temple 18 JAN 500 p(6) 10,00,000 Security Printing Press, Hyderabad 2. 100th Birth Anniversary of Karpoori Thaku...

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...