Skip to main content

తపాల బిళ్ళల పై S. V. రంగారావు , భానుమతి, అల్లు రామలింగయ్య

వందేళ్ళ సినిమా కి వందనం 
మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు.
ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు . 
మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం  ముగ్గురు నటులకు మాత్రమే లభించింది. 
ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు S. V. రంగారావు , భానుమతి, అల్లు రామలింగయ్య


 ఎస్వీ రంగారావు (1918-1974)
సామర్ల వెంకట రంగారావు - SVR గా తెలుగు చిత్ర సీమలో పేరొందిన  నటుడు.  మూడు దశాబ్దాలపాటు మూడొందల పైగా సాంఘిక పౌరాణిక సినిమాలలో  అద్భుతంగా నటించిన సహజ నటుడు.  ఘటోత్కచుడిగాకీచకుడిగారావణాసురుడిగా తనకు తానే సాటిగా ప్రేక్షకుల మన్నలను గడించాడు. నర్తనశాల చిత్రంలో తన నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు. 
S.V.RANGA RAO
పద్మశ్రీ భానుమతీ రామకృష్ణ (1925 - 2005)
శ్రీమతి  భానుమతి  తెలుగు చలన చిత్ర సీమలో వెన్నదగిన  నటిమణి. ఈమెకు అనేక రంగాలలో ప్రవేశం ఉంది.   నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు గా కుడా లబ్ద ప్రతిష్టులు. మల్లీశ్వరి,బాటసారి,చండీరాణి, మగమ్మగారి మనుమరాలు వంటి ఉత్తమ చిత్రాలలో నటించిన నటి.  NTR  జాతీయ పురస్కారం , రఘుపతి వెంకయ్య రాష్ట్ర పురస్కారం పొందిన విలక్షణ నటి . 
BHANUMATHI 
పద్మశ్రీ అల్లు రామలింగయ్య ( 1922-2004)
తెలుగు చిత్ర సీమ లో 1030 చిత్రాలలో హాస్య నటునిగా తెలుగు వారికి వినోదం పంచిన నటుడు.  భారత ప్రభుత్వం 1990 లో ' పద్మశ్రీ ' అవార్డు తో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు. రఘుపతి వెంకయ్య రాష్ట్ర పురస్కారం పొందిన హాస్య నటుడు .  

ALLU RAMALINGIAH
100- YEARS OF INDIAN CINIMA -FIRST DAY COVER 


Comments

These stamps are great. I would like to see others such as Nagaiah, Relangi, Nagireddi, Chakrapani, Sri Sri, Krishna Sastry and Kanchanamala also honored with stamps.
kodali srinivas said…
హిందీ చలన చిత్రాల తరువాత రెండో స్థానం మన తెలుగు చిత్ర రంగానిదే. ఈ నూరేళ్ళ ప్రస్తానం లో ఎందరో మహానుభావులు. ఇంతకు ముందు L. V. ప్రసాద్ , BN రెడ్డి, ఎన్టీఆర్, సావిత్రి , ఘంటసాల, గోపీచంద్ గార్లకు తపాలా బిళ్ళలు విడుదల చేసారు. ఇంకా పాత తరం వారిలో రఘుపతి వెంకయ్య,చిత్తూరు నాగయ్య, కన్నాంబ, రేలంగి, సూర్యకాంతం, కాంతారావు ,రాజనాల, రమణా రెడ్డి,మధ్య తరంలో శోభన్ బాబు, గుమ్మడి,రాజ బాబువంటి మంచి నటులు ఉన్నారు. వీరికి తపాల బిళ్ళలు రావలిసిన ఆవశ్యకత ఉంది. మన తెలుగు వారికి ఈ విషయంలో ఏ మాత్రం ఆసక్తి అభిమానం ఉన్నట్లు లేదు. 50 తపాల బిళ్ళలలో మూడు దక్కటం మాహా బాగ్యం. సినీ నటుడు చిరంజీవి సలహా మేరకు ఆయన మామ అల్లు రామలింగయ్య పేరు వచ్చింది. ఇలా వత్తిడి చేసే వారు ఉంటేనే తపాలా బిళ్ళలు వస్తాయి. ఇక పోతే శ్రీశ్రీ , నార్ల, చక్రపాణి వంటి వారికి అడిగే వారే లేరు.
kodali srinivas said…
This comment has been removed by the author.

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...