Skip to main content

శ్రీ కూర్మం కుర్మానాధ దేవాలయం - శ్రీకాకుళం

India post Issued a set of two postage stamps and one miniature sheet on Srikurmam and  Arassavalli  Temples in Srikakulam Dist. Andra Pradesh on the occasion of Telugu new year "Ugadi" on 11-04-1213. 
These set of stamps and Miniature have been released in the series of Architectural Heritage of India.
ARCHITECTURAL HERITAGE OF INDIA - M.S
ARASAVALLI - SRI KURMAM TEMPLES
మన భారత తపాలా శాఖ 11-04-2013 న  భారతీయ శిల్ప కళా సంపద లో భాగం గా 
"Architectural Heritage of India "పేరుతో తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున  మన రాష్ట్రం లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రెండు ప్రాచీన దేవాలయాల పై రెండు తపాలా బిళ్ళలు  మరియు ఒక మినియెచర్ ను విడుదల చేసింది. వీటిపై 20 రూపాయల విలువ గల తపాలా బిళ్ళపైన అరసవల్లి సూర్య దేవాలయం , 5 రూపాయల విలువ గల మరొక తపాలా బిళ్ళ పైన  శ్రీకూర్మం లోని కూర్మనాధ స్వామీ ఆలయం చోటు చేసుకున్నాయి. ఇవి రెండు జంట గా అందమైన మరో 25 రూపాయల మినియెచర్ కుడా విడుదల చేసారు. 
ARCHITECTURAL HERITAGE OF INDIA - FDC
ఇంతకు ముందు మన తెలునాట ఉన్న సుప్రసిద్ద దేవాలయాలు అయిన తిరుమల-తిరుపతి, శ్రీశైలం లో ఉన్న దేవాలయాల పై తపాల బిళ్ళలు విడుదల అయ్యాయి .
  
శ్రీ కూర్మం కుర్మానాధ దేవాలయం 
శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరానగల శ్రీకూర్మం గ్రామంలో "కూర్మనాధ స్వామి" మందిరం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. భారతదేశంలో విష్ణు మూర్తి దశ అవతారాలలో ఒకటి అయిన  కూర్మావతారం లో దర్శనమిచ్చే మందిరం ఇదొక్కటే. 
ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది.  పడమటి అభి ముఖంగా నిర్మింపబడిన ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు గలవు. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. 

అరసవల్లి సూర్య దేవాలయం 
శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ  ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం.
ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న  మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత.


Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...

STAMPS ON HINDU GODS BY THAILAND POST

THAILAND post issued a set of four stamps with miniature on our Hindu Gods Ganesh,Bramha,Vishnu and Siva on 2- 6 -2009 Ganesha , which is another name for Vinayaka, means the "God who has power over obstacles". A son of Shiva and Uma, he has the face of an elephant and he was blessed by his father so as to have the power to dispel all obstacles. Offerings must be made to Ganesha before any other gods. Brahma, according to Brahmin Doctrine, is believed to be the Creator of all things on earth. The Musnapurana Legend states that he divided himself into two parts-one being a male figure, which was Brahma himself and the other in female form, named Sraswathi, whoe served as his consort. They helped each other in creating deities, humans, animals, demons and plants. Narayana, also known to the Thais as Phra Narai, is responsible for preserving things in their appropriate condition. His work is continual so as to create peace and harmony in the world. Narai has ten incarnated liv...