Skip to main content

రణరంగ చౌక్ - తెనాలి

A Special cover Issued by Indian Post on 1-11-2007 in APPEX -2007, held at  Vishakhapatnam. This Special cover depicts - Ranarang chouk -Tenali ,Guntur dist.
విశాఖపట్నం లో జరిగిన ఆంద్ర ప్రదేశ్ తపాలా బిళ్ళల ప్రదర్శనలో (APPEX -2007) 1-11-2007న  ఒక  ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల చేసారు.  దానిపై  తెనాలి లో ఉన్న స్వతంత్ర పోరాట యోధుల స్మారక స్తూపం 'రణరంగ చౌక్' ను ముద్రించారు.
దానిపై ప్రత్యేక తపాలా ముద్రగా మహాత్మా గాంధీ బొమ్మను ఉపయోగించారు
Special cover on Ranarang chouk -Tenali

మన దేశ స్వతంత్ర పోరాటం లో భాగం గా 1942 లో ఆగష్టు 9న జరిగిన ముంబాయి  కాంగ్రెస్ సమావేశంలో  సంపూర్ణ స్వరాజ్యాఉద్యమానికి నాంది పలుకుతూ   " క్విట్ ఇండియా " తీర్మానాన్ని ఆమోదించారు. 

ఈ సభకు గుంటూరు జిల్లా నుండి  ప్రముఖ స్వతంత్రయోధుడు గాన్దేయవాది శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి నాయకత్వంలో వెలవొలు సీతారామయ్య, పుతుంబాక శ్రీరాములు,అవుతు సుబ్బారెడ్డి, శరణు రామస్వామి చౌదరి పాల్గొని వచ్చారు.  వీరి రాకతో ఆంద్ర లో క్విట్ ఇండియా ఉద్యమం చాలా  ఉదృతంగా జరిగింది  ఈ ఉద్యమం తెనాలిలో అదుపుతప్పి  హింసాత్మకంగా మారినది. 

1942 ఆగష్టు 12న  జరిగిన పోలిసుల కాల్పులలో ఏడుగురు యువకులు అసువులు బాసారు.

1. భాస్కరుని లక్ష్మీనారాయణ 2. మాజేటి సుబ్బారావు 3. శ్రీపతి పండితారాధ్యుల శ్రీగిరి రావు 4. ప్రయాగ రామయ్య 5. జాస్తి అప్పయ్య 6. తమ్మినేని సుబ్బారెడ్డి 7. గాలి రామకోటయ్య

 వీర మరణం చెందిన ఈ  స్వతంత్ర పోరాట యోధులకు తెనాలిలో1959 డిసెంబర్ 20న  ఒక స్మారక స్తూపం నిర్మించి దానికి  'రణరంగ చౌక్' అని పేరు పెట్టారు.

శిధిలమైన ఈ అమరవీరుల స్థుపాన్ని 12-8-2015 న సుందరంగా తీర్చిదిద్ది  క్విట్ ఇండియా వేడుకలు చేస్తున్నారు. 

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...