Skip to main content

Chaudary Charan Singh - చౌధరీ చరణ్ సింగ్


A commemorative stamp Issued by Indian Post On  Chaudary Charan Singh, The fifth prime minister of India. Date of Issue : 29 -5 - 1990
First day cover on _Chaudary Charan Singh
రైతు బాంధవుడు , కర్షక మిత్రుడు, గాన్దేయ వాది, మాజీ ప్రధాన మంత్రి శ్రీ చౌధరీ చరణ్ సింగ్ (1902 - 1987 ) 23 - 12 - 1902 వ సంవత్సరములో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము, మీరట్ జిల్లాలోని నూర్‌పూర్ లో జన్మించాడు. 1923లో సైన్సులో పట్టా పుచ్చుకొని 1925లో ఆగ్రా విశ్వవిద్యాలయము నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. ఈయన ఆ తరువాత న్యాయవిద్య అభ్యసించి వకీలుగా ఘజియాబాదులో జీవితాన్ని ప్రారంభించాడు. 1929లో మీరట్ కి చేరి ఆ తదనంతరం కాంగ్రేసు పార్టీలో చేరాడు.
1937లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఛత్రౌలి నుండి ఎన్నికై ఆ నియోజక వర్గానికి 1946, 1952, 1962 మరియు 1967 లలో ప్రాతినిధ్యం వహించాడు. 1946లో గోవింద వల్లభ్ పంత్ మంత్రివర్గములో పార్లమెంటరీ కార్యదర్శియై రెవిన్యూ, ఆరోగ్య మరియు సాంఘీక పరిశుభ్రత, న్యాయ, సమాచర శాఖలలో పనిచేశాడు. 1951 జూన్ లో రాష్త్రములో కేబినెట్ మంత్రిగా నియమితుడై న్యాయ మరియు సమాచార శాఖ మంత్రిగా ఆ తరువాత 1952లో డా.సంపూర్ణానంద్ మంత్రివర్గములో రెవిన్యూ మరియు వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1959 ఏప్రిల్ లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
చరణ్‌సింగ్ 1960లో హోమ్ మరియు వ్యవసాయశాఖా మంత్రిగా, 1962-63లో వ్యవసాయ మరియు అటవీ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1965లో వ్యవసాయ శాఖను విడిచి 1966లో స్థానిక స్వయంపరిపాలనా శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. కాంగ్రేసు పార్టీ చీలిక తర్వాత, 1970 ఫిబ్రవరిలో కాంగ్రేసు మద్దతుతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవ దఫా ముఖ్యమంత్రయ్యాడు. కానీ 1970 అక్టోబర్ 2 న ఈయన ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రములో రాష్ట్రపతి పాలన విధించబడినది.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరణ్‌సింగ్ భూసంస్కరణలు చేపట్టాడు. 1960 లాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకునివచ్చాడు. జనతా పార్టీ నిర్మాణం లో కీలక పాత్ర వహించి మొదటి కాంగ్రేసర ప్రభుత్వాన్నిమొరాజ్జి దేశాయి ప్రధాన మంత్రిగా,ఈయన ఉప ప్రధానమంత్రిగా  పనిచేశాడు. ఆ తరువాత 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ భారతదేశ 5వ ప్రధానమంత్రిగా పనిచేశాడు.
వీరి గౌరవార్దం 29 -05 -1990 న మన తపాల శాఖ  ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది. రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

Stamps Issued by India Post- 2024

భారత తపాలా శాఖ  2024 లో మొత్తం 32 ప్రత్యేక తపాల బిళ్లలను, 11 మినియేచర్స్  విడుదల చేసింది.  వీటిలో అత్యధిక విలువతో 100 రూపాయల శ్రీ రామ జన్మభూమి దేవాలయం పై  మినియేచర్  ముఖ్యమైనది. 6 తపాలా బిళ్లలతో కేవలం 30 రూపాయల ముఖ విలువగల దీనిని 100 రూపాయలకు అమ్మటం జరిగింది.  ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల  ముద్రించిన తపాల బిళ్ళ ఉన్న మినియేచర్ ను 300 రూపాయలకు చేసి అమ్మారు. ఇదే ఇప్పటివరకు  ఖరీదైనదిగా నమోదు చేయబడింది. ఈ ఏడాది మన వెండి తెర వెలుగు పద్మభూషణ్ అక్కినేని శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక తపాలా బిళ్ళ వెలువడింది.  Sri Rama Janmbhoomi Temple Face Rs 30  Sold for  Rs 100 Embedded with Water from the holy river Saryu, Soil from the holy city of Ayodhya, Fragrance of Sandal wood, and gold foil at relevant portions శ్రీ రామ జన్మభూమి దేవాలయం - మినియేచర్  1.      Shri Ram Janmbhoomi Temple 18 JAN 500 p(6) 10,00,000 Security Printing Press, Hyderabad 2. 100th Birth Anniversary of Karpoori Thaku...

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...