ఈ ఎన్నికలు అధికారం లో ఉన్న వారికి , లేని వారికి ఇద్దరికీ సమ న్యాయం కల్పిస్తూ, పక్షపాత రహితంగా, రాగ ద్వేషాలకు తావు లేకుండా వివాద రహితంగా జరిపించేది మన భారత ఎన్నికల సంఘం. చాలావరకు ఇది తన కర్తవ్యాన్ని చేస్తూనే ఉంది. కాని దానిని చేతానా రహితంగా చేసే రాజకీయం నేడు ప్రభిలింది.
1950 లో ఏర్పడిన ఈ సంఘం తన విడిలో 60 సంవత్సారాలు పూర్తి చేసుకున్న వేళ 25-01-2010 లో ఒక తపాల బిళ్ళ విడుదల చేసారు.
![]() |
60 YEARS OF ELECTION COMMISSION OF iNDIA |
ఎన్నికల సంస్కరణ లో ఎన్నికల సంఘం పాత్ర తో పాటు ఓటరుగా మన పాత్ర కుడా చాలా ఉంటుందన్న సంగతి గమనించాలి. ఏదో ఒక విదంగా గెలవాలి, తరువాత దోచుకోవాలి అనే దోపిడి నాయకులకు బుద్ది వచ్చేలా మన ఓటు తో చెప్పాలి. దుర్మార్గుల దౌష్ట్యం కన్నా మంచి వారి మౌనం సమాజానికి చెడు చేస్తుంది. లక్షల కోట్ల అవినీతిని చూస్తూ ఇంకా మౌనం ఉండటం మంచిది కాదు. తప్పు ని తప్పు గా చెప్పలేక పోవటం కుడా తప్పే. తప్పును సమర్దించటానికి మరొక తప్పు ఎత్తి చూపటం దుర్మార్గులు చేసే పని. సమయం వచ్చింది. మేలుకో
ఓటు విలువ తెలుసుకో -బతుకులో వెలుగు నింపుకో !
Comments