Skip to main content

ఓటు విలువ తెలుసుకో

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం గా కీర్తించబడే మన దేశంలో త్వరలో సాధారణ ఎన్నికలు (లోక్ సభ) వాటితో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మంచి పాలకులు వస్తేనే ఈ దేశం , ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి. 
మతానికి, కులానికి, ప్రాంతానికి, ధనానికి, దర్పానికి లొంగకుండా నిర్బయంగా ,వివేకంగా మన పాలకులను ఎన్నుకోవాలి. 
స్వాతంత్రం వచ్చి 67 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ దేశం లో ఎవరికీ ఓటు వేయాలో , ఎటువంటి నాయకులను అధికార పీటం పై ఉంచాలో మనం తెలుసుకోలేక పోవటం శోచనీయం.  
దొంగలు, దోపిడిదారులు, అవినీతి జలగలు, పుండాకోర్లు, దగాకోర్లు దర్జాగా మన ముందుకు ఓట్లు అడగటానికి వస్తున్నారు అంటే మనం ఎంతగా దిగజారి పోయి ఉన్నామో అర్ధం చేసుకోండి.  
ఓటు విలువ పామరులకు తెలియజేయాటానికి అందరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే విషయానికి  విస్తృతం గా ప్రచారం చేయటానికి మన తపాలా శాఖ 1967 లో జరిగిన సాధారణ ఎన్నికల సమయం లోనే  ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను 13-1-1967 న విడుదల చేసింది. 57 ఏళ్ళు అయినా మనలో ఏమాత్రం చైతన్యం వచ్చినట్లు కనపడుటం లేదు. 
అప్పుడు సాంబారు ఇడ్లీకి, సారా బుడ్డికి  ఓటు అమ్ముకున్న అమాయకులను చూసాం.  నేడు అమాయకులు లేరు కాని ఆనాటి కంటే ఈనాడు ఇంకా ఎక్కువ మంది రకరకాల ప్రలోబాలకు లొంగి  తమ ఓటును అమ్ముకుంటున్నారు.  ఈ తీరులో పెను మార్పు రావాలి.  
General Election – Indian Stamps depicting Voters, Polling Booth


ఈ ఎన్నికలు అధికారం లో ఉన్న వారికి , లేని వారికి ఇద్దరికీ సమ న్యాయం కల్పిస్తూ, పక్షపాత  రహితంగా, రాగ ద్వేషాలకు తావు లేకుండా వివాద రహితంగా జరిపించేది మన భారత ఎన్నికల సంఘం. చాలావరకు ఇది తన కర్తవ్యాన్ని చేస్తూనే ఉంది. కాని దానిని చేతానా రహితంగా చేసే రాజకీయం నేడు ప్రభిలింది. 
1950 లో ఏర్పడిన ఈ సంఘం తన విడిలో 60 సంవత్సారాలు పూర్తి చేసుకున్న వేళ 25-01-2010 లో ఒక తపాల బిళ్ళ విడుదల చేసారు.  
60 YEARS OF ELECTION COMMISSION OF iNDIA

ఎన్నికల సంస్కరణ లో ఎన్నికల సంఘం పాత్ర తో పాటు ఓటరుగా మన పాత్ర కుడా చాలా ఉంటుందన్న సంగతి గమనించాలి. ఏదో ఒక విదంగా గెలవాలి, తరువాత దోచుకోవాలి అనే దోపిడి నాయకులకు బుద్ది వచ్చేలా మన ఓటు తో చెప్పాలి. దుర్మార్గుల దౌష్ట్యం కన్నా మంచి వారి మౌనం సమాజానికి చెడు చేస్తుంది. లక్షల కోట్ల అవినీతిని చూస్తూ ఇంకా మౌనం ఉండటం మంచిది కాదు.  తప్పు ని తప్పు గా చెప్పలేక పోవటం కుడా తప్పే.  తప్పును సమర్దించటానికి మరొక తప్పు ఎత్తి చూపటం దుర్మార్గులు చేసే పని.  సమయం వచ్చింది. మేలుకో 
ఓటు విలువ తెలుసుకో -బతుకులో వెలుగు నింపుకో !

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...