Skip to main content

విప్లవ యోధులు రాజగురు,సుఖదేవ్,భగత్ సింగ్

India Post released a stamp on 22nd March 2013
 to honor  Shiv Ram Hari Rajguru, a freedom fighter,revolutionist and colleague of Bhagat Sing and Sukhadev.   
Shiv Ram Hari Rajguru
విప్లవ యోధుడు శివరాం హరి రాజగురు (24-08-1908 - 23-03-1931)గౌరవార్దం మన తపాల శాఖ 22- 3- 2013 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ ని దారుణంగా కొట్టి వారి మరణానికి కారకుడైన పోలిస్ ఆపీసర్ ను హత్య చేసి ప్రతీకారం తీసుకున్న కేసులో భగత్ సింగ్, సుఖదేవ్ ల తో పాటు 1931 మార్చ్ 23 న ఉరి కంభం ఎక్కిన విప్లవ సింహం రాజగురు. 
భారత పాకిస్తాన్ సరిహద్దులో సట్లేజ్ నది వడ్డున గల హుస్సైనివాల  గ్రామంలో ఈ విప్లవ యోధులకు అంత్యక్రియలు చేసారు. పాకిస్తాన్ మన నుండి విడదిసినప్పుడు ఇది వారి భూభాగం లోకి పోయింది. 1961 లో మన ఆధీనంలో ఉన్న 12 గ్రామాలను పాకిస్తాన్ కు ఇచ్చి హుస్సైనివాల  ను మనం తీసుకున్నాం . 1971లో పాకిస్తాన్ -భరత్ యుద్ధం లో పాకి సైనికులు హుస్సైనివాల  ను ఆక్రమించి అక్కడ ఉన్న భగత్ సింగ్,సుఖదేవ్,రాజగురుల స్మారక విగ్రహాలను ద్వంసం చేసారు. వాటిని మరల 1973 లో తిరిగి ప్రతిస్టించబడ్డాయి. ప్రతి ఏడాది మార్చ్ 23 న ఇక్కడ ' షాహీద్ మేళా' జరుగుతుంది.  
ఈ తపాలా బిళ్ళ పై హుస్సైనివాల  లో ఆనాడు ప్రతిష్టించిన ఈ ముగ్గురి స్మారక విగ్రహాలు కుడా చిత్రించారు. 
హుస్సేంవాలా లో ఉన్న సుఖదేవ్,భగత్ సింగ్, రాజగురు స్మారక విగ్రహాలు 
ఇంతకు ముందు మన భారత తపాల శాఖ వారు 1968 లో విప్లవ యోధుడు సర్దార్ భగత్ సింగ్ గౌరవార్దం ఒక తపాలా బిళ్ళ విడుదల  చేసారు. ఇప్పుడు రాజగురు కు తపాలా బిళ్ళ విడుదల చేసారు. అలాగే  భగత్ సింగ్ ముఖ్య అనుచరుడు సుఖదేవ్ కు,భగత్ సింగ్ తో పాటు అసంబ్లీ లో బాంబ్ లు విసిరిన భుక్తేస్వర దత్ లకు  కుడా  తపాలా బిళ్ళలు విడుదల చేయాలి. 
Bhagat Sing 
Date of Issue : 19-10-1968
Bhagat Sing - FDC 
భగత్ సింగ్ ,రాజ గురు, సుఖదేవ్ లు ఉరి కంభం ఎక్కి 50 సంవత్సరాలు అయిన సందర్బం గా ఈ అమర వీరులకు నివాళి అర్పిస్తూ మన తపాలా శాఖ 23-03-1981 లో ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది 
HOMAGE TO MARTYRS

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...

STAMPS ON HINDU GODS BY THAILAND POST

THAILAND post issued a set of four stamps with miniature on our Hindu Gods Ganesh,Bramha,Vishnu and Siva on 2- 6 -2009 Ganesha , which is another name for Vinayaka, means the "God who has power over obstacles". A son of Shiva and Uma, he has the face of an elephant and he was blessed by his father so as to have the power to dispel all obstacles. Offerings must be made to Ganesha before any other gods. Brahma, according to Brahmin Doctrine, is believed to be the Creator of all things on earth. The Musnapurana Legend states that he divided himself into two parts-one being a male figure, which was Brahma himself and the other in female form, named Sraswathi, whoe served as his consort. They helped each other in creating deities, humans, animals, demons and plants. Narayana, also known to the Thais as Phra Narai, is responsible for preserving things in their appropriate condition. His work is continual so as to create peace and harmony in the world. Narai has ten incarnated liv...