Skip to main content

కాసు బ్రహ్మానందరెడ్డి

First Day Cover -K. Bramhananda Reddy

India Post released a commemorative postal stamp on KASU BRAHMANANDA REDDY on 28th July 2011.
కాసు బ్రహ్మానందరెడ్డి 102 వ జయంతి సందర్బం గా మన తపాలా శాఖ 28- 7- 2011 న ఒక ప్రతేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.  

KASU BRAHMANANDA REDDY
శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసావురావు పేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు. మదరాసు పచయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1946 నుండి 1952 వరకు 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనారు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పురపాలక శాఖ మంత్రిగా  వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు. 
1964వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో వారు 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో భాద్యతలు చేపట్టి కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించారు.
1977లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధార్థ శంకర్ రే పై పోటీచేసి విజయం సాధించారు. తదనంతరం ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఆమెను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్ నిట్టనిలువునా చీలింది. ఒక వర్గానికి ఇందిరాగాంధీ నాయకత్వం వహించగా మరో వర్గానికి కాసు సారథ్యం వహించారు. ఆయన నేతృత్వంలోని పార్టీ రెడ్డి కాంగ్రెస్ గా రూపాంతరం చెందింది. 1978లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధి ఘన విజయం సాధించింది. దానితో రెడ్డి కాంగ్రెస్ 1980లో ఇందిరాకాంగ్రెస్‌లో విలీనం చేశారు. బ్రహ్మానందరెడ్డి 1994 మే 20 న హైదరాబాద్ లో మరణించారు.

Comments

nagi7 said…
Nice blog
Please visit my blog at
www.indianpostmarks.blogspot.com

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

Stamps Issued by India Post- 2024

భారత తపాలా శాఖ  2024 లో మొత్తం 32 ప్రత్యేక తపాల బిళ్లలను, 11 మినియేచర్స్  విడుదల చేసింది.  వీటిలో అత్యధిక విలువతో 100 రూపాయల శ్రీ రామ జన్మభూమి దేవాలయం పై  మినియేచర్  ముఖ్యమైనది. 6 తపాలా బిళ్లలతో కేవలం 30 రూపాయల ముఖ విలువగల దీనిని 100 రూపాయలకు అమ్మటం జరిగింది.  ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల  ముద్రించిన తపాల బిళ్ళ ఉన్న మినియేచర్ ను 300 రూపాయలకు చేసి అమ్మారు. ఇదే ఇప్పటివరకు  ఖరీదైనదిగా నమోదు చేయబడింది. ఈ ఏడాది మన వెండి తెర వెలుగు పద్మభూషణ్ అక్కినేని శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక తపాలా బిళ్ళ వెలువడింది.  Sri Rama Janmbhoomi Temple Face Rs 30  Sold for  Rs 100 Embedded with Water from the holy river Saryu, Soil from the holy city of Ayodhya, Fragrance of Sandal wood, and gold foil at relevant portions శ్రీ రామ జన్మభూమి దేవాలయం - మినియేచర్  1.      Shri Ram Janmbhoomi Temple 18 JAN 500 p(6) 10,00,000 Security Printing Press, Hyderabad 2. 100th Birth Anniversary of Karpoori Thaku...

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...