Skip to main content

గాన కోకిల - ఘంటసాల

తెలుగు సినిమా చరిత్రలో శాశ్విత కీర్తిని పొందిన మధుర గాయకుడు
పద్మశ్రీ ఘంటసాలవెంకటేశ్వరరావు (జ. 4-12-1922 మ. 11-02-1974)
కృష్ణ జిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో జన్మించిన గాన కోకిల ఘంటసాల గారు ఈ నాడు భౌతికంగా మన మధ్య  లేక పోయినా పాట రూపంలో తెలుగు నాట జీవించే ఉన్నారు.
 'మల్లియ లారా మాలిక లారా మౌనముగా ఉన్నారా ' , 'మనసున మనసై బ్రతుకున బ్రతుకై ' , 'నిలువవే వాలు కనుల దాన ' , 'ఏమండీ ..ఇటు చూడండీ ' 'దేవ దేవ ధవళాచల 'వంటి భక్తిగీతాలు 'గుండమ్మ కథ' లో 'కోలు కోలో యన్న కోలో నా సామి ','లేచింది నిద్రలేచినింది ' వంటి పాటలు వారి గాన మాధుర్యానికి మచ్చుకు కొన్ని మాత్రమే. 
ఇంకా 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ' , 'ప్రతి రాత్రి వసంత రాత్రి ', 'దేవుడు చేసిన మనుషుల్లారా ', 'భలే మజాలే భలే ఖుషీలే ' 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' , 'త్యాగ శీల వమ్మా మహిళా ', 'ఊరు మారినా ఉనికి మారునా ', 'చీకటిలో కారు చీకటిలో '- 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ' వంటి వెన్నో మధుర గీతాలు ఘంటసాల గొంతులో ఉపిరి పోసుకొని తెలుగు వారిని మైమరిపిస్తున్నాయి. 
'అత్త లేని కోడలుత్తమురాలు ఓ యమ్మా',-వంటి జనరంజిక గీతాలతోపాటు కరుణశ్రీ గారి పుష్ప విలాపం 'భగవద్గీత పారాయణం'వారి కీర్తిని తెలుగునాట శాశ్వితంగా నిలుపుతాయి. 1970 లో వీరిని పద్మశ్రీ బిరుదు తో భారత ప్రభుత్వం సత్కరించింది. 

ఘంటసాల వెంకటేశ్వరరావు  గారి గౌరవార్దం మన తపాల శాఖ వారు rs 5/- విలువగల ఒక ప్రత్యేక తపాల బిళ్ళను వారి వర్దంతి సందర్బంగా 11-2-2003 న విడుదల చేసారు
 A commemorative postage stamp of GHANTASALA 
Issued on- 11-2-2003
First day cover - Gantasala Venkateswararao



Comments

మాస్టారి జన్మదినం నాడు ఆయన మధుర జ్ఞాపకాలు అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
Venugopal said…
ఘంటశాల కాదు ఘంటసాల
kodali srinivas said…
మీ స్పందనలకు ధన్యవాదాలు

@వేణుగోపాల్ : నేను ఘంటసాల గారిని ఘంటసాల గానే గుర్తుంచుకుంటా!మరి మీరు ఏ ఉద్దేశ్యం తో ఇలా అన్నారో తెలపండి.
dokka srinivasu said…
Respected Kodali Srinivas garu

Namaste. Srinivas garu thanks for the post on our music lengend "Ghantasala mastaru garu".

Srinivas garu recently i am presented my Third Seminar on Indian Heritage and Culture to young children. In this seminar i am sharing my paintings and other collections relating to Indian Heritage and explaining children about various aspects of our Heritage and Culture through my collections. Children are eagerly participated in my seminar and they clarified their doubts about our glorious heritage.

http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html

Srinivas garu please look into my Third Seminar on Indian Heritage post and share your valuable and inspirational comment for the same.

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...