Skip to main content

ఆంధ్రుల రాజధాని అమరావతి

ఎప్పుడో 2000 ఏళ్ల క్రితమే  ఆంధ్రుల రాజధానిగా  విలసిల్లిన ధాన్యకటకం (ధరణికోట) ఆ తరువాత అమరావతిగా ప్రపంచ ప్రసిద్ది చెందినది.  ఈ పట్టణం పేరు  తిరిగి స్పురించేలా  నేడు మరల నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అవతరించటం శుభపరిణామం.
Amaravathi Sculpture 
India Post Issued a Commemorative postage stamp on 19 - 06 - 2003 on Amaravathi Sculpture preserved  at Govt. Museum -Chennai
Govt. Museum -Chennai

ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకురాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలతకలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధునిజీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడినచైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్విలో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. అప్పటికే మహాచైత్యం అంతాకూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగాజరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఇక్కడదొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్లలో భద్రపరిచారు. అమరావతి లో ఉన్న అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవితచరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి చెన్నై లోని ప్రభుత్వప్రదర్శనశాలలో భద్రపరచారు. అలా బద్రపరిచిన శిలా పలకాలలో ఒక దానిని 19-06 -2003 లో చెన్నై లో ఉన్న ప్రభుత్వ పురా వస్తు ప్రదర్శన శాల కు 150 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా విడుదలైన తపాల బిళ్ళపై ముద్రించారు.ఈతపాలాబిళ్ల ల తో పాటు ఒక మినిఎచార్ కుడా విడుదల చేసారు.
 Pictorial Cancellation  on Amaravath
A Special Cover on  Pictorial Cancellation at
Amaravathi on 28-02- 1976
అమరావతినగర   చారిత్రిక ప్రసిద్ధిని గుర్తించిన తపాల శాఖవారు అమరావతికి ప్రత్యేక తపాల ముద్రను 28-02-1976 లో  కేటాయించారు. ప్రతేక కవర్ పై బుద్దుని బొమ్మక్యాన్సిలేషన్ ముద్రపై అమరావతి లోఒకప్పుడున్న బౌద్ద స్తూపం ఉంది.
12 -04 -1975 న(ఉగాది పర్వదినాన) ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు జరిగినప్పుడు మన భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళ ను విడుదల చేసారుతొలి రోజు విడుదల చేసిన  ప్రత్యేక కవరు పైన తెలుగు జాతి ఘన చరిత్రకు చిహ్నంగా  అమరావతి లో లభ్యమైన పూర్ణ కుంభం ను ముద్రించారు.
 అమరావతి లో లభ్యమైన పూర్ణ కుంభం
Special cover on GUNTUR PEX-2004, Amaravathi Stupa, A.P.
Date of Issue : 06-08-2004

కాల చక్ర -2006
Special cover on Kalachara -2006, Amaravathi, A.P.
Date of Issue : 09-01-2006
బౌద్ద మతం లోని వజ్రయాన తెగకు చెందిన ఒక పూజా క్రతువు ఈ 'కాల చక్ర'. బౌద్దమత గురువు దలైలామా ఆద్వర్యం లో2006 లో  జనవరి 04 నుండి 15 వరకు గుంటూరు జిల్లా అమరావతి జరిగిన ౩౦ వ కాలచక్ర క్రతువు లో మన తపాల శాఖ విడుదల చేసిన ప్రత్యేక కవరు.

Comments

Popular posts from this blog

A spcial cover on Prof. P.R. Ramakrishnan

A spcial cover on Prof. P.R. Ramakrishnan was issued by India Post on 29th March, 2018 on his Birth centenary celebrations. Prof. P.R. Ramakrishnan, Industrialist, M.P and Educationalist Prof. P R RAMAKRISHNAN , Son of Shri V. Rangaswamy Naidu; born in Peelamedu, Coimbatore on October 11, 1917; educated at Madras University. A post-graduate in electrical engineering from the Massachusetts Institute of Technology (USA) Mr. Ramakrishnan had worked in the General Electric Company in the U.S. for seven years. P. R. Ramakrishnan was the first Indian Alumni of MIT Sloan School of Management and a graduate of Massachusetts Institute of Technology, United States who founded Madras Aluminum Company, South India Viscose, Coimbatore Institute of Technology and many other textile industries and two time Member of Parliament representing Indian National Congress from Coimbatore for the 3rd Lok Sabha during the 1962 General Elections and Pollachi for the 2nd Lok Sabha during the 1957 General Electio

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసి రేడియో అక్కయ్య గా పేరొందారు. బాలబాలికల ప్రగతికై పాటుబడిన న్యాయపతి రాఘవరావ

మహానేత నందమూరి తారక రామారావు

తెలుగు వారికి ఒక విశిష్టత, గుర్తింపు కల్పించిన మహా నటుడు, మహానేత మన NTR .  NTR  గౌరవార్దం 28-05- 2000 న మన తపాల శాఖా వారు మూడు రూపాయల విలువగల ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.  ఈ తపాలా బిళ్ళ రూపకల్పన పరమాద్బుతం.  ఈ తపాల బిళ్ళ పై నందమూరి తారాక రామారావు గారి చిత్రం తో పాటు వారి కీర్తి శిఖరం కు చిహ్నం గా హిమాలయ పర్వతాలు, చలన చిత్ర రంగానికి ప్రతినిధిగా సినిమా రీలు, దానిలో వారి ప్రజా/ కళా సేవకు గుర్తుగా భూమి,సూర్యుడు ఉన్నాయి.  N.T.RAMA RAO India Post released one  Commemorative postage stamp  to   Dr. N.T.Ramarao   on  28-05-2000 BROCHURE- NTR తపాలాబిళ్ళ తో  పాటు విడుదల చేసిన ప్రత్యక తపాలా కవరుపై ( FIRST DAY COVER ) ప్రజలతో ప్రసంగించుతున్న N.T.రామారావు గారి చిత్రం ముద్రించారు .  ఈ ప్రత్యేక కవర్ పై  ప్రత్యేక తపాలా ముద్ర గా ' శ్రీ కృష్ణ దేవరాయలు వేషం లో ఉన్న  రామారావు ' చిత్రం తో రూపొందించటం మరొక ప్రత్యేకతను సంతరించుకుంది.  FIRST DAY COVER -NTR నందమూరి   తారక   రామారావు (1923-1996)  విశ్వ   విఖ్యాత   నట   సార్వ భౌముడు,  తెలుగు   జాతి   కీర్తి   పతాక