Skip to main content

ఆంధ్రుల రాజధాని అమరావతి

ఎప్పుడో 2000 ఏళ్ల క్రితమే  ఆంధ్రుల రాజధానిగా  విలసిల్లిన ధాన్యకటకం (ధరణికోట) ఆ తరువాత అమరావతిగా ప్రపంచ ప్రసిద్ది చెందినది.  ఈ పట్టణం పేరు  తిరిగి స్పురించేలా  నేడు మరల నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అవతరించటం శుభపరిణామం.
Amaravathi Sculpture 
India Post Issued a Commemorative postage stamp on 19 - 06 - 2003 on Amaravathi Sculpture preserved  at Govt. Museum -Chennai
Govt. Museum -Chennai

ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకురాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలతకలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధునిజీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడినచైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్విలో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. అప్పటికే మహాచైత్యం అంతాకూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగాజరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఇక్కడదొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్లలో భద్రపరిచారు. అమరావతి లో ఉన్న అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవితచరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి చెన్నై లోని ప్రభుత్వప్రదర్శనశాలలో భద్రపరచారు. అలా బద్రపరిచిన శిలా పలకాలలో ఒక దానిని 19-06 -2003 లో చెన్నై లో ఉన్న ప్రభుత్వ పురా వస్తు ప్రదర్శన శాల కు 150 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా విడుదలైన తపాల బిళ్ళపై ముద్రించారు.ఈతపాలాబిళ్ల ల తో పాటు ఒక మినిఎచార్ కుడా విడుదల చేసారు.
 Pictorial Cancellation  on Amaravath
A Special Cover on  Pictorial Cancellation at
Amaravathi on 28-02- 1976
అమరావతినగర   చారిత్రిక ప్రసిద్ధిని గుర్తించిన తపాల శాఖవారు అమరావతికి ప్రత్యేక తపాల ముద్రను 28-02-1976 లో  కేటాయించారు. ప్రతేక కవర్ పై బుద్దుని బొమ్మక్యాన్సిలేషన్ ముద్రపై అమరావతి లోఒకప్పుడున్న బౌద్ద స్తూపం ఉంది.
12 -04 -1975 న(ఉగాది పర్వదినాన) ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు జరిగినప్పుడు మన భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళ ను విడుదల చేసారుతొలి రోజు విడుదల చేసిన  ప్రత్యేక కవరు పైన తెలుగు జాతి ఘన చరిత్రకు చిహ్నంగా  అమరావతి లో లభ్యమైన పూర్ణ కుంభం ను ముద్రించారు.
 అమరావతి లో లభ్యమైన పూర్ణ కుంభం
Special cover on GUNTUR PEX-2004, Amaravathi Stupa, A.P.
Date of Issue : 06-08-2004

కాల చక్ర -2006
Special cover on Kalachara -2006, Amaravathi, A.P.
Date of Issue : 09-01-2006
బౌద్ద మతం లోని వజ్రయాన తెగకు చెందిన ఒక పూజా క్రతువు ఈ 'కాల చక్ర'. బౌద్దమత గురువు దలైలామా ఆద్వర్యం లో2006 లో  జనవరి 04 నుండి 15 వరకు గుంటూరు జిల్లా అమరావతి జరిగిన ౩౦ వ కాలచక్ర క్రతువు లో మన తపాల శాఖ విడుదల చేసిన ప్రత్యేక కవరు.

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...

STAMPS ON HINDU GODS BY THAILAND POST

THAILAND post issued a set of four stamps with miniature on our Hindu Gods Ganesh,Bramha,Vishnu and Siva on 2- 6 -2009 Ganesha , which is another name for Vinayaka, means the "God who has power over obstacles". A son of Shiva and Uma, he has the face of an elephant and he was blessed by his father so as to have the power to dispel all obstacles. Offerings must be made to Ganesha before any other gods. Brahma, according to Brahmin Doctrine, is believed to be the Creator of all things on earth. The Musnapurana Legend states that he divided himself into two parts-one being a male figure, which was Brahma himself and the other in female form, named Sraswathi, whoe served as his consort. They helped each other in creating deities, humans, animals, demons and plants. Narayana, also known to the Thais as Phra Narai, is responsible for preserving things in their appropriate condition. His work is continual so as to create peace and harmony in the world. Narai has ten incarnated liv...