Skip to main content

తపాలబిళ్ళలపై తెలుగు వెలుగులేవి?


తపాల బిళ్ళ అనేది ఒక జాతి కీర్తి పతాకం. ఒక గౌరవ చిహ్నం. చరిత్రకు దర్పణం.తమ జాతిసంస్కృతి,సాంప్రదాయాలపైన,వేష భాషల పైన, కళలపైన, వైతాళికుల పైన ప్రత్యేక తపాలా బిళ్లలను ఆయా దేశాలు వారు ముద్రిస్తారువీటిని బట్టి ప్రపంచ వ్యాప్తంగాఉండే తపాలబిళ్ళల సేకరణకారులు ఆయ జాతి వైభవాన్ని తెలుసుకుంటారు. మరి మన తెలుగు జాతి సంస్కృతి కి చరిత్రకి మన దేశపు తపాలా బిళ్ళలు దర్పణం పడుతున్నాయా అన్నది ప్రశ్నార్ధకమే. మన పోస్టల్ శాఖ వారు వెలువరించిన తపాల బిళ్ళల గురించి తెలుసుకుంటే విషయంలో మన తెలుగువారిపై ఎంత వివక్ష ఉన్నదో అవగతం అవుతుంది

భారత ప్రభుత్వం ఇప్పటి వరకు వెలువరించిన షుమారు 2550 పోస్టల్ స్టాంప్స్ లో తెలుగు వారి పైన, తెలుగు జాతి సంస్కృతి పైన 68ఏళ్లలో విడుదల చేసిన తపాలా బిళ్లలు  కేవలం 50 లోపు మాత్రమే. విడుదల అయిన ఈ తపాల బిళ్ళల లో  కుడా మన వారి కృషి కంటే మన ప్రక్క న ఉన్న తమిళనాట ఉన్న  తెలుగు  సోదరుల కృషే ఎక్కువ. 
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి,  ప్రధాన మంత్రి వంటి వారికి, వారి మరణాన్తరం ప్రత్యేక తపాల బిళ్ళలు  విడుదల చేయటం ఆనవాయితి. కలాం గారికి ఈమధ్యే తపాల బిళ్ళ విడుదల చేసారు.  అయితే కీ.శే. పి.వి నరసింహారావు గారికి, నీలం సంజీవరెడ్డి గారికి ఇంతవరుకు పోస్టల్ స్టాంప్స్ విడుదల చేయలేదంటే వారిపట్ల, మన తెలుగు జాతి పట్ల ఎంత నిర్లక్షం  ఉందొ తెలుస్తూనే వుంది.
జ్ఞానపీట్  అవార్డ్ లు పొందిన హిందీ, బెంగాలి, తమిళ్, కన్నడ, మలయాళ వంటి అన్ని భాషా  కవులకు తపాలా బిళ్ళలు విడుదల చేసిన తపాలా శాఖ  వారు మన విశ్వనాధ సత్యనారాయణ, రావూరి భరద్వాజలను విస్మరించారు. దేశంలో ఉన్న ప్రముఖమైన పశుజాతి అంటూ విడుదల చేసిన నాలుగు తపాల బిళ్ళలలో మన ఒంగోలు జాతి గిత్త కు చోటు దక్కలేదు. ఇలా ఒక సమూహం లో విడుదల చేసే తపాల బిళ్లలో దక్షిణ భారత దేశం నుండి ఎప్పుడు తమిళనాడుకే స్థానం ఉంటుంది. దీనిని బట్టి తెలుగువారిపై   కేంద్రం చూపుతున్న  చిన్న చూపు అర్ధమోతుంది.  ఈ విషయంలో మన వారి నిర్లక్షం తేటతెల్లం అవుతుంది. 
స్వామి  నారాయణ తీర్థ, రామదాసు, క్షేత్రయ్య, సిద్దేంద్ర యోగి, పోతులూరి వీర బ్రహ్మం, ఆదిభట్ల నారాయణ దాసు, నాజర్,  శ్రీశ్రీ, జాషువా, కొసరాజు, నార్ల, సంజీవదేవ్, దామర్ల రామారావు, బాపు రమణ, అక్కినేని నాగేశ్వరరావు,  వంటి ఎందరో మహానుభావులు వారికి తపాలా బిళ్ళలు విడుదల చేయించాలన్న ఉహా ఈ మహనీయుల జయంతులు చేసిన/చేస్తున్న నిర్వహకులకు కాని ,ప్రభుత్వ పెద్దలకు కాని రాలేదు. 

అలాగే ఇంకా తెలుగు భాషకు, జాతి వికాసానికి సేవ చేసిన గిడిగు రామమూర్తి, కోడి రామూర్తి, సి. పి. బ్రౌన్, దార్శినికులు సర్ అర్ధర్ కాటన్, డా. కె.యల్. రావు, వాసిరెడ్డి ప్రసాదరాజా, వెలగపూడి రామకృష్ణ, డా.నాయుడమ్మ, స్వాతంత్ర యోధులు ఉయ్యాలవాడ నర్శింహా రెడ్డి, కన్నెగంటి హనుమంతు,  దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, కల్లూరి చంద్రమౌళి, కడప కోటిరెడ్డి, గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మరి ఎందరో తెలుగు ప్రముఖులుకు శాశ్విత గుర్తుగా తపాలా బిళ్ళలు  విడుదల చేయించి  వారిని గౌరవించ వలిసిన బాధ్యత తెలుగు వారందరిపైన వుంది

తెలుగు వారి గత  వైభవాన్ని చాటే అమరావతి, లేపాక్షి, కాకతీయుల శిల్పకళకు, ఏటికొప్పాక, కొండవీటి బొమ్మలకు గుర్తింపు కలిగేలా తపాల బిళ్ళ వచ్చేలా  కృషి చేయాలి. ఉత్సవాల పేరుతో ఉరికే డబ్బు దుబారా చేయటం కాదు. కొద్ది కాలం మాత్రమే ఉండే  ప్రత్యేక సంచకలు ప్రచురిస్తారు కాని శాశ్వితంగా ఉండే తపాలా బిళ్ళను తిసుకురావాలన్న ఆలోచన మన వారికి కలగటం లేదు. చిత్త సుద్ది  లేని ఇలాంటి సభల నిర్వాహణ వల్ల  తెలుగు భాషకు, జాతికి మేలు జరుగుతుందని అనుకోవటం ఒక భ్రమ.

విషయంలో పోరుగునవున్న తమిళ సోదరుల నుండి ఉత్తేజం పొందాలి.
ఇప్పటికైనా కళ్ళుతెరిచి తెలుగు జాతి సంస్కృతి కి చరిత్రకి సంభందించిన తపాలా బిళ్ళలు కొన్నైనా కొత్త సంవత్సరంలో వచ్చేలా కృషి చేయాలి.తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచంలో చాటాలి


Comments

Konatham Dileep said…
చక్కని ప్రయత్నం. తెలుగు వారి తపాళా బిళ్లలే కాక ఇతర వాటిపై కూడా రాస్తున్నట్టున్నారు?

కొణతం దిలీప్
hridayam.wordpress.com
kodali srinivas said…
మీ అభిప్రాయం చెప్పినందులకు ధన్యవాదాలు

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

Stamps Issued by India Post- 2024

భారత తపాలా శాఖ  2024 లో మొత్తం 32 ప్రత్యేక తపాల బిళ్లలను, 11 మినియేచర్స్  విడుదల చేసింది.  వీటిలో అత్యధిక విలువతో 100 రూపాయల శ్రీ రామ జన్మభూమి దేవాలయం పై  మినియేచర్  ముఖ్యమైనది. 6 తపాలా బిళ్లలతో కేవలం 30 రూపాయల ముఖ విలువగల దీనిని 100 రూపాయలకు అమ్మటం జరిగింది.  ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల  ముద్రించిన తపాల బిళ్ళ ఉన్న మినియేచర్ ను 300 రూపాయలకు చేసి అమ్మారు. ఇదే ఇప్పటివరకు  ఖరీదైనదిగా నమోదు చేయబడింది. ఈ ఏడాది మన వెండి తెర వెలుగు పద్మభూషణ్ అక్కినేని శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక తపాలా బిళ్ళ వెలువడింది.  Sri Rama Janmbhoomi Temple Face Rs 30  Sold for  Rs 100 Embedded with Water from the holy river Saryu, Soil from the holy city of Ayodhya, Fragrance of Sandal wood, and gold foil at relevant portions శ్రీ రామ జన్మభూమి దేవాలయం - మినియేచర్  1.      Shri Ram Janmbhoomi Temple 18 JAN 500 p(6) 10,00,000 Security Printing Press, Hyderabad 2. 100th Birth Anniversary of Karpoori Thaku...

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...