హైదరాబాద్ నగరానికి మణి హారం సాలార్ జంగ్ మ్యూజియం. దీనిలో ఉన్న సేకరణలన్నీ మీర్ యూసుఫ్ ఆలీ ఖాన్ చే సేకరించినవే, ఇతను సాలార్ జంగ్ III గా ప్రసిధ్ధి.ఈ మ్యూజియం లోఉన్న 78 గదులలో 40,000 వస్తువులు గలవు. ఇందులో ప్రముఖంగా : పరదాలో యున్న "రెబెక్కా",జహంగీర్ చురకత్తి,నూర్జహాన్ పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన "యాఖూతి ఉల్-మస్తామీ" యొక్క ఖురాన్ ప్రతి, గడియారం మరియు "స్త్రీ-పురుష శిల్పం" ప్రధానమైనవి.వీటితో పాటు ఇంకా సేకరణల్లో గ్రంధాలు, పోర్సిలీన్, తుపాకులు, ఖడ్గాలు, శిల్పాలు ప్రపంచపు నలుమూలలనుండీ తెప్పించి భద్రపరచబడినవి. 27-07-1978 లో మన ప్రాచీన కళా సంపద బద్రపరిచిన పురా వస్తు ప్రదర్సన శాల ల పై ముద్రించిన నాలుగు తపాల బిళ్ళ లలో ఒకటి మన సాలార్ జంగ్ మ్యూజియం లో ఉన్న జహంగీర్ చురకత్తి,నూర్జహాన్ పండ్లుకోసే కత్తి బొమ్మలతో ముద్రించారు.
On the view of APPEX-88, A Special cover issued by Indian Post on Rani Rudrama Devi of Kakatiya Dynasty on 8-06- 1988. తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ 8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది. దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు. దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు. Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు. రాణి రుద్రమ దేవి అసమాన ధైర్య సాహసాలతో ఆనాటి ఆంధ్రదేశమంతటినీ సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో ఒక మహిళగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

Comments