Skip to main content

శ్రీశైలం - మల్లిఖార్జున స్వామి దేవాలయం

                                     
శ్రీశైలం - మల్లిఖార్జున స్వామి దేవాలయం
ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రఖుమైనది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి  శ్రీశైలం లో ఉన్న భ్రమరాంభ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం. 
ఈ ఆలయం పై మన భారత తపాల శాఖ 15 -5 -2003 న  ఒక తపాల బిళ్ళవిడుదల చేసింది.
మన రాష్ట్రం లో కర్నూలు జిల్లా లో నలమల కొండల పై ఉన్న ఈ  దేవాలయము అభేద్యమైన ప్రాకారము కలిగి  లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో చూడ ముచ్చటగా ఉంటుంది.  ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా  చాలా సాధారణ నిర్మాణం తో ఉంటుంది.
Mallikarjuna swami temple -SRISAILAM - FDC 

శ్రీశైలం భ్రమరంభా మల్లిఖార్జునల దేవాలయం ఫై ఇంతకు ముందు మన తపాల శాఖ ఆ ఆలయ ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేక పోస్టల్ ముద్ర ను కేటాయించి 7-3-1978 న ఒక ప్రత్యేక కవరు విడుదల చేసింది. 
ప్రత్యేక పోస్టల్ ముద్రగా (Pictorial post mark )ఆలయ రాజ గోపురం ను కవరు పై   భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లను ముద్రించారు.
Pictorial post mark - Srisailam
Pictorial Cancellations – Inaugural Cover- Srisailam
A Pictorial Cancellation was introduced at Srisailam on Lord Mallikarjuna Temple on 07 Mar 1978 . An Inaugural special cover was issued to commemorate the Event. The Cancellation shows Temple and cover Shows Lord Mallikarjuna and Bhramaramba.
India Post Issued a set of Four  Commemorative postage stamps on  15 -5 -2003 on famous Hindu temples 
One of the Stamps shows Mallikarjuna swami temple -SRISAILAM and remainig  three stamps are on other Hindu temples at Bhadrinath, Udayapur, puri.
Srisailam is a Holy town situated in Nallamala Hills of Kurnool District of Andhra Pradesh on the banks of River Krishna.

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...