Skip to main content

విజయవాడలో వైభవంగా ముగిసిన తపాలా బిళ్ళల ప్రద్రర్శన (APPEX -2014)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి తపాలా బిళ్ళల ప్రదర్శన విజయవాడలో మూడు రోజుల పాటు జరిగి  వైభవంగా ముగిసినది. 
2014 జూలై 24,25,26 తేదిలలో జరిగిన  తపాలా బిళ్ళల  ప్రద్రర్శన (APPEX -2014) లో తెలంగాణా ,ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండి తపాల బిళ్ళల సేకరణ కర్తలు పాల్గొని తమ తమ సేకరణలను ప్రదర్శించారు. 
ఈ సందర్బం గా తపాలా శాఖ వారు ఆరు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేశారు. 
వీటిలో మన తెలుగు వారి విశిష్టతను  చాటేలా 'తెలుగు వెలుగులు ' పేరుతో తెనాలి కి చెందిన  శ్రీ విష్ణుమొలకల సాయి కృష్ణ సేకరించి ప్రదర్శించిన తపాలా బిళ్ళలు  అత్య అద్బుతమైన ప్రదర్శన గా పలువురి మన్ననలు అందుకుంది. తెలుగు లిపి తో ఉన్నఏకైక  ప్రదర్శన కుడా ఇదే.   
ఈ ప్రదర్శన కు  సాయి కృష్ణ కు వెండి -రజిత ( SILVER- BRONGE ) పతకం  బహుమతిగా వచ్చింది.  
తెలుగు వారు గర్వపడేలా ఉన్న ఈ ప్రదర్శన విశేషాలను  మన పాటకుల  కొరకు తదుపరి టపాలో పరిచయం చేస్తాను 
శ్రీ విష్ణుమొలకల సాయి కృష్ణ  ప్రదర్శించిన  'తెలుగు వెలుగులు 'ను
వీక్షించు చున్నబ్లాగు రచయిత కొడాలి శ్రీనివాస్ 
APPEX-2014 లో విడుదల చేసిన ప్రత్యేక తపాలా కవర్లు 

చేనేత పరిశ్రమ - మచిలీపట్నం 

లేపాక్షి  హస్త కళలు 

తీరాంధ్ర మడ అడవులు- జీవజాలం 
ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు 
ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు

గ్రామీణ ఉపాధి హామీ - MGNREGS 




Comments