
ALLURI SEETARAMA RAJU
అల్లూరి సీతారామ రాజు (1897 - 1924 ) - సాయుధ పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సాధించాలని తుది వరకు పోరాడి ప్రాణాలు విడిచిన విప్లవ వీరుడు మన అల్లూరి.మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి , వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేసి తెల్ల వాళ్ళ పై సమర శంఖంఉదాడు.
దేశ దాస్య విముక్తి కొరకు ప్రాణ త్యాగం చేసిన ఈ విప్లవ వీరుని గౌరవార్దం 26 - 12 - 1986 న మన తపాల శాఖ వారు ఒకప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు.
దేశ దాస్య విముక్తి కొరకు ప్రాణ త్యాగం చేసిన ఈ విప్లవ వీరుని గౌరవార్దం 26 - 12 - 1986 న మన తపాల శాఖ వారు ఒకప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు.
![]() |
First day cover on Alluri Seetharama Raju |
Comments