Skip to main content

భారత రత్న బి. ఆర్. అంబేద్కర్ తపాల బిళ్ళ


Commemorative Stamp on Dr. B. R. Ambedkar & Constitution of India - 30th September 2015.
Dr.B.R. అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాలు సందర్బంగా మన తపాల శాఖ 30-9-2015 న మరొక  స్మారక తపాల బిళ్ళ విడుదల చేసింది.  Dr.B.R. అంబేద్కర్ మరియు భారత రాజ్యాంగం పేరుతో ఈ తపాలా బిళ్ళ విడుదలైంది . 
భారత రాజ్యంగ నిర్మాతగా ,దళిత బడుగు వర్గాలకు సమాజంలో ఉన్నత స్థానం కల్పించటానికి రిజర్వేషన్స్ , ప్రతేక హక్కులు కల్పించిన నేతగా , మేధావిగా , బౌద్ద మతాభిమానిగా, అబినవ మనువుగా  కొనయాడబడే వ్యక్తి భారతరత్న బి. ఆర్ అంబేద్కర్ (1891-1956). 
Dr.B.R. Ambedkar and Constitution of India 

వీరి గౌరవార్దం మన తపాల శాఖ ఇప్పటివరకు వివిధ సందర్బాలలో ఇంతకు పూర్వం  ఆరు తపాల బిళ్ళలు విడుదల చేసింది. మహాత్మా గాంధీ, చాచా నెహ్రు ల తరువాత అత్యధిక తపాల బిళ్ళలు విడుదల చేసింది  అంబేద్కర్ పైనే 
75వ జయంతి 14-4-1966 న విడుదల చేసిన తపాల బిళ్ళ 
Dr. B.R. Ambedkar  - 75th Birth Anniversary
Date of Issue - 14 -04-1966
83వ జయంతి 14-4-1973 న విడుదల చేసిన తపాల బిళ్ళ 
Dr. B.R. Ambedkar  - 83rd  Birth Anniversary
Date of Issue - 14 -04-1973

 అంబేద్కర్ శత జయంతి ని పురస్కరించుకొని 14-4-1973 న విడుదల చేసిన తపాల బిళ్ళ 
Dr. Bhimrao Ramji Ambedkar  - Birth Centenary
Date of Issue - 14 -04-1991


భారత రత్న బాబాసాయబ్ అంబేద్కర్ మరణాంతరం (6-12-1956) ముంబాయి లో  బౌద్ద మత పద్దతిలోఅంత్య క్రియలు జరిగాయి.  వారి తుది సంస్కారాలు జరిగిన ప్రదేశం లో 5-12-1971 న   బౌద్ద చైత్యం వలె నిర్మించిన స్మారక కట్టడం   ' చైత్య భూమి '. 
భారత తపాల శాఖ  అంబేద్కర్ 112 వ జయంతి ని పురస్కరించు కొని 14-04-2013 నఈ చైత్య భూమి  పై ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసింది.

Dr.B.R. Ambedkar - Chaity Bhoomi
 Chaity Bhoomi -  Mumbai - FDC
రోజువారి వాడకం లో ఉపయోగించే తపాల బిళ్ళలు ( Definitive Stamps) కుడా రెండు విడుదల చేసారు 
One on 14th April 2001(300), and  Second one on  9th March,2009(200)
 Definitive Stamp - 9th March,2009
Definitive Stamp - 14th April 2001
   

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...