Skip to main content

Posts

Showing posts from 2025

ఆరుద్ర - స్మారక తపాల బిళ్ళ

ARUDRA (1925-1998) రచయిత, అభ్యుదయ కవి, సినీ గేయ కవి ఆరుద్ర గా లబ్ద ప్రతిష్ఠుడైన భాగవతుల సదాశివ శంకరశాస్త్రి శత జయంతి సందర్భంగా మన తపాలా శాఖ వారు 16-12-2025 న ఒక ప్రత్యేక స్మారక తపాల బిళ్ళను  విడుదల చేశారు. వీరి రచనలలో ఆంధ్ర సాహిత్య చరిత్ర , త్వమేవాహం, వేమన వాదం, గుడిలో సెక్సు వంటి గ్రంథాల తో పాటు దాదాపు మూడు వేల సినిమా పాటలు రాసారు. 

పుట్టపర్తి సత్య సాయి బాబా శత జయంతి

Sri Sathya Saibaba - Miniature Sheet  పుట్టపర్తి సత్య సాయి బాబా శత జయంతి సందర్భం గా మన తపాలా శాఖ నాలుగు తపాలా బిళ్ళలు తో ఉన్న ఒక మినియేచర్ ను నవంబరు 19, 2025న పుట్టపర్తిలో ప్రధాని మోడీ గారు విడుదల చేసారు. ఈ తపాలా బిల్లలపై ఒకదానిపై  శ్రీ సత్య సాయి బాబా చిత్రము ఉంటే మిగిలిన మూటిపై  పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయం , శ్రీ సత్యసాయి వైద్య శాల , శ్రీ సత్య సాయి విశ్వ విద్యాలయం భవనాలు చోటు చేసుకొన్నాయి. ఒక ఆధ్యాత్మిక బాబా పై ఒక మినియేచరు విడుదల చేయటం ఇదే మొదటసారి.  ఇంతకు ముందు సత్య సాయి బాబా గారి స్మృత్యర్థం  23-11-2013 లో ఒక తపాలా బిళ్ళ విడుదల చేసారు. అంతకు ముందు 1999లో శ్రీ సత్యసాయి తన సేవలో భాగంగా అనంతపురం జిల్లాలో ప్రజల దాహార్తి కొరకు నిర్మించిన త్రాగునీటి ప్రాజెక్టు పై ఒక తపాలా బిళ్ళ విడుదలైంది.  https://stampsofandhra.blogspot.com/2013/11/blog-post_23.html

మహానటి భానుమతి

మన తపాలా శాఖ 1-05-2025 న  వేవ్స్ -2025 ( World Audio Visual and Entertainment Summit (WAVES - 2025)  వేడుకలో ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  మన భారతీయ సినీ దిగ్గజాలగా పరిగణించబడే ఐదుగురు సినీ ప్రముఖుల తపాలా బిళ్లలతో ఉన్న ఈ మినియేచర్ లో మన తెలుగు చిత్ర సీమలో నటిగా , దర్సకురాలిగా, నిర్మాతగా, గాయనిగా ప్రసిద్ధి పొందిన మహానటి  భానుమతి గారి తపాలా బిళ్ళ ఉంది. వీరితో పాటు సినీ రంగ ప్రముఖులు  గురు దత్ , రాజ్ కోస్లా, రిత్విక్ ఘటక్, సలీల్ చౌదరి గార్లకు గౌరవం దక్కింది.  P. Bhanumathi -  World Audio Visual and Entertainment Summit (WAVES 2025)   ఇది భానుమతి గారిపై విడుదలైన రెండవ తపాలా బిళ్ళ. తెలుగు చిత్రరంగంలో ఈ అరుదైన ఘనత దక్కిన నటి భానుమతి గారే. ఇంతకుముందు మన భారతీయ చలన చిత్ర శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విడుదల చేసిన తపాలా బిళ్లలలో వీరికి స్థానం లభించింది.  P  Bhanumathi An Indian actress, singer, film producer, director, music composer, and novelist, she is often regarded as the first female superstar of Telugu cinema. She also became the first fema...

Stamps Issued by India Post- 2024

భారత తపాలా శాఖ  2024 లో మొత్తం 32 ప్రత్యేక తపాల బిళ్లలను, 11 మినియేచర్స్  విడుదల చేసింది.  వీటిలో అత్యధిక విలువతో 100 రూపాయల శ్రీ రామ జన్మభూమి దేవాలయం పై  మినియేచర్  ముఖ్యమైనది. 6 తపాలా బిళ్లలతో కేవలం 30 రూపాయల ముఖ విలువగల దీనిని 100 రూపాయలకు అమ్మటం జరిగింది.  ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల  ముద్రించిన తపాల బిళ్ళ ఉన్న మినియేచర్ ను 300 రూపాయలకు చేసి అమ్మారు. ఇదే ఇప్పటివరకు  ఖరీదైనదిగా నమోదు చేయబడింది. ఈ ఏడాది మన వెండి తెర వెలుగు పద్మభూషణ్ అక్కినేని శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక తపాలా బిళ్ళ వెలువడింది.  Sri Rama Janmbhoomi Temple Face Rs 30  Sold for  Rs 100 Embedded with Water from the holy river Saryu, Soil from the holy city of Ayodhya, Fragrance of Sandal wood, and gold foil at relevant portions శ్రీ రామ జన్మభూమి దేవాలయం - మినియేచర్  1.      Shri Ram Janmbhoomi Temple 18 JAN 500 p(6) 10,00,000 Security Printing Press, Hyderabad 2. 100th Birth Anniversary of Karpoori Thaku...