Skip to main content

Posts

Showing posts from December, 2013

గుర్తింపు లేని నీలం సంజీవరెడ్డి శత జయంతి

భారతదేశపు ఆరోవ రాష్ట్రపతిగా 1977-1983 వరకు పనిచేసిన శ్రీ నీలం సంజీవ రెడ్డి(1913-1996) గారి శత జయంతి ని గుర్తించని కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో మన తెలుగు వారిని  మరో సారి కించపరిచింది. రాష్ట్రపతి గా ఏకగ్రీవంగా ఎన్నికై   రెండు సార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గా పనిచేసి  రెండు పర్యాయాలు లోకసభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి  శ్రీ నీలం సంజీవరెడ్డి. వారి శత జయంతి ని మన రాజధాని ఢిల్లీ లో తలుచుకున్న నాధుడే లేడు.  మన రాష్ట్రపతులు గా పనిచేసి పదవి విరమణ చేసే రోజున వారి గౌరవార్దం తపాలా బిళ్ళ ను విడుదల చేయటం కుడా ఒక సాంప్రదాయం గా ఉంది.  1962 లో రాష్ట్రపతిగా పదవి విరమణ చేస్తున్న బాబు రాజేంద్ర ప్రసాద్ కు, 1967 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కు 1974 లో వి.వి గిరి గారికి ఈ సాంప్రదాయాన్ని బట్టి తపాలా బిళ్ళలు వేసింది. అలాగే రాష్ట్రపతులుగా పనిసేస్తూ మరణించిన జాకీర్ హుస్సేన్ , పక్రుద్దిన్ అలీ అహమ్మద్ కు వెను వెంటనే తపాలా బిళ్ళలు వేశారు. ఆ తరువాత కాంగ్రెసేతర రాష్ట్ర పతి గా ఉన్న నీలం సంజీవ రెడ్డి కి తపాలా బిళ్ళను వేయకుండా (ఇందిరా గాంధీ) ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది.  ఇది కాంగ్రెస్ మార్క్ రాజకీయం.  రాష్ట్రప

ఇండియా -జపాన్ మైత్రి బంధం ... కుతుబ్ మినార్ - టోక్యో టవర్

India Post released a 20 rupees Miniature stamp   on the Visit of Emperor Akihitho  and Empress Michiko  of Japan on 5th December 2013. The miniature sheet shows Qutub Minar and Tokyo Tower  Qutub Minar and Tokyo Tower జపాన్ దేశ రాజు రాణి మన దేశానికి వచ్చిన సందర్బం గా మన తపాలా శాఖ  5-12-2013 న ఒక మినిఎచర్ షీట్ ని విడుదల చేసింది.  ఇలా ప్రముఖులు దేశ సందర్శన కు వచ్చినపుప్పుడు వారి గౌరవార్దం వారి చిత్రాలతో  తపాలా బిళ్ళలు విడుదల చేయటం చాలా దేశాలలో ఉంది. కాని మన దేశం లో వ్యక్తుల ప్రీతి కొరకు ఇప్పటి వరకు తపాలా బిళ్ళలు విడుదల చేయలేదు. ఇదే తొలిసారి. జపాన్ రాజు రాణి చిత్రాలు కాకుండా ఇండియా -జపాన్ మైత్రి బంధం గా  దీనిపై కుతుబ్ మినార్ ,టోక్యో టవర్ చిత్రాలు ముద్రించారు.