Skip to main content

Posts

Showing posts from November, 2012

ప్రపంచ తెలుగు మహా సభలు

ఒక జాతి సంస్కృతిని, సాహిత్యాన్ని,  వైభవాన్ని,ఔన్యత్వాన్ని,చరిత్రను  పది కాలాల పాటు ప్రపంచం నలువైపులా  చాటి చెప్పేవి తపాలా బిళ్ళలే. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానంగా, అపురూపంగా దాచుకొనే తపాళా బిళ్ళల ప్రాముఖ్యం చెప్పనలవి కానిది. తపాల బిళ్ళ ఒక గౌరవ చిహ్నం. అంగరంగ వైభవం గా  1975 లో ప్రపంచ తెలుగు మహా సభలు తొలి సారి హైదరాబాదు లో జరిగినప్పుడు మన పోస్టల్ శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఆనాటి సభలకు తీపి గుర్తుగా అనేక మంది తపాలా బిళ్ళల సేకరణ దారుల వద్ద పదిలంగా బద్రపరచ బడినవి. ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు  హైదరాబాద్   లో   12  - 04  - 1975   న( ఉగాది పర్వదినాన )   ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు   జరిగినప్పుడు  మన భారత తపాల శాఖ వారు ఒక  ప్రత్యేక   తపాల   బిళ్ళ  ను  విడుదల   చేసారు .  ఈ   తపాల   బిళ్ళ   వెల   25   పైసలు .  దాని పై చదువుల తల్లి సర్వస్వతి చిత్రం దాని వెనుక తెలుగు పదాలు ముద్రించారు.  A Commemorative postage stamp on world telugu conference  Date of  Issue -   12 -04 -1975 ' దేశ   భాషల   యందు   తెలుగు   లెస్స  ' అన్న   శ్రీ   కృష్ణ  

వినియోగదారుల రక్షణ చట్టం -1986

On completion of 25 years of Consumer Protection Act -1986 , India Post released a postal stamp on  29th November 2012 Consumer Protection Act of 1986  is an Indian federation law enacted in 1986 to protect interests of consumers in  India . It makes provision for the establishment of consumer councils and other authorities for the settlement of consumers  disputes and for matters connected therewith. Consumer Protection Act of 1986  వినియోగదారుల రక్షణ చట్టం -1986  సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం   కేంద్ర ప్రభుత్వం  వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act) ను  1986 లోరూపొందించ బడినది.దీని ప్రకారం ఒక వినియోగదారుడు కొన్న వస్తువు యొక్క నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉండే దానివలన కలిగే ఆర్ధిక మరియు ఇతర నష్టాలను ఆ వస్తువును తయారుచేసిన సంస్థ భరించాల్సి వుంటుంది. దీనికి సంబందించిన తగాదాల పరిష్కారం కొరకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక న్యాయ సంస్థలను ఏర్పరిచి వినియోగదారుల హక్కులను కాపాడుతుంది. ఈ

2050 లో మన పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుంది?

ప్రతి సంవత్సరం నవంబర్ 14 న నెహ్రు గారి జయంతి ని మన జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి బాలల దినోత్సవానికి మన తపాలా శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేస్తారు. దానిపై మన బాల,బాలికలకు దేశ వ్యాప్తంగా ఒక అంశం పై చిత్ర లేఖన పోటి లు నిర్వహించి వాటిలో ప్రధమ స్థానం పొందిన చిత్రాన్ని ఈ తపాల బిళ్ళ పై ముద్రిస్తారు.  అలాగే ఈ ఏడాది ' 2050 లో మన పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుంది?' అనే అంశం పై తపాల శాఖ వారు నిర్వహించిన చిత్ర లేఖన పోటిలో ప్రధమ బహుమతి పొందిన చిత్రాన్నిఈ ఏడాది బాలల దినోత్సవం   14-11-2012 న ప్రత్యక తపాలా బిళ్ళ గా  విడుదల చేసారు.   childern's day-2012 India Post released a stamp on 14th November 2012 to commemorate Children's day. As usual the stamp is based on the drawings made by children in a stamp Design competition organised by the Department of Posts.The theme of the competition this year was 'Post Office 2050'.

సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు

Dr . DWARAM VENKATASWAMY NAIDU India post Issued a   Commemorative   postage   stamp  on   8-11-1983. ద్వారం వెంకటస్వామి నాయుడు (1893 - 1964 ) గొప్ప వయెలిన్ (వాయులీనం) విద్వాంసుడు. భారత ప్రభుత్వం వీరికి  1957 లో పద్మశ్రీ అవార్డ్ ప్రధానం చేసింది. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం 'మహారాజా సంగీత కళాశాల'లో వయొలిన్ ఆచార్యునిగా చేరి, 1936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు.వయోలిన్ వాయిద్యంతో ఒంటరిగా  కచేరీలు (solo concerts, అంటే వయొలినే ప్రధాన సాధనంగా) ఇచ్చి వయోలిన్ కి విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చారు. కర్ణాటక సంగీతంలో ఉన్న కీర్తనలను వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి కూడా ఇతనే. సంగీతం అనేది " వివిపించే తపస్సు " అనీ, ఏరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ   తన శిష్యులకు చెప్పేవాడు. సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడి గారి శతజయంతి సందర్బంగా ( 8 - 11 - 1993 ) న మన తపాల శాఖ  ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు . First day cover